Harish Rao: హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హారీశ్రావు విమర్శించారు.
హైదరాబాద్: హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హారీశ్రావు విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి .. హోదాకు తగ్గట్టు మాట్లాడటం లేదని అన్నారు. సింగూరు జలాలను మెదక్కు దక్కేలా చేసింది కేసీఆరేనని చెప్పారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ‘‘వెంకట్రామిరెడ్డి వేల ఎకరాలు లాక్కున్నారని అంటున్నారు. భూ సేకరణ చేస్తేనే లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. రేవంత్ రెడ్డి తన పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు’’ అని హరీశ్రావు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.