Kanakamedala: ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల

గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 21 May 2024 17:44 IST

దిల్లీ: గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు. గత రెండేళ్లుగా మాచర్లలో వైకాపా హింస కొనసాగుతున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తప్పనిసరి కేసులు నమోదు చేయాల్సి వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆక్షేపించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి సీతారామాంజనేయులు కనుసన్నల్లో దాడులు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని కనక మేడల డిమాండ్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని