40 ఏళ్లలో ఇలాంటి దాడులు చూడలేదు: యనమల
కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో అమ్మవారి జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన దళిత యువకుడు రాము కుటుంబానికి, క్షతగాత్రులకు అండగా ఉంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు భరోసానిచ్చారు.
తొండంగి, న్యూస్టుడే: కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో అమ్మవారి జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన దళిత యువకుడు రాము కుటుంబానికి, క్షతగాత్రులకు అండగా ఉంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు భరోసానిచ్చారు. తొండంగిలో మృతుడి కుటుంబాన్ని, శృంగవృక్షంలో క్షతగాత్రులను గురువారం ఆయన తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడితో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 40 ఏళ్ల నుంచి సోదరభావంతో కలసిమెలసి ఉండే తుని నియోజకవర్గంలో ఇలాంటి దాడులు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అనంతరం మృతుడు రాము కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కోడ వెంకటరమణ, పేకేటి హరికృష్ణ, చొక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్