Bandi Sanjay: టీఎస్పీఎస్సీ కేసులో సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: బండి సంజయ్
టీఎస్పీఎస్సీ కేసులో సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వరంగల్లో నిర్వహించిన భాజపా ‘నిరుద్యోగ మార్చ్’ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు.
వరంగల్: టీఎస్పీఎస్సీ కేసులో సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వరంగల్లో నిర్వహించిన భాజపా ‘నిరుద్యోగ మార్చ్’ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. కాకతీయ కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి నష్టపోయిన బాధిత యువతకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఇచ్చే వరకు నిద్రపోనని చెప్పిన కేసీఆర్ను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. భాజపాకు రాజకీయాలు ముఖ్యం కాదని, 30లక్షల మంది యువత భవిష్యత్ ముఖ్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకే ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్ నిర్వహించినట్టు చెప్పారు.
నోటిఫికేషన్ కూడా సరిగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. అన్ని పేపర్ల లీకులకూ బండి సంజయే కారణమని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమక్షంలో దోషులు సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఇంట్లోని వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో తప్పు లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సిట్పై తమకు నమ్మకం లేదని, సిట్ దర్యాప్తు చేసిన ఏ కేసులోనూ సరిగా చేయలేదన్నారు.
‘‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకై 30లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడినా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నా సీఎం స్పందించలేదు. ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న, రైతులు చనిపోయినా సీఎం స్పందించలేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు పడి నిరుద్యోగులు హైదరాబాద్ వస్తారు. కానీ, ఉద్యోగాల పేరుతో కేసీఆర్ యువతను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్. ఈనెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ,హైదరాబాద్లో లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్నిర్వహిస్తాం’’ అని బండి సంజయ్ తెలిపారు. భాజపా నేతలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు,ప్రేమేందర్రెడ్డి, గరికపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!