Nara Lokesh: ఇసుకపై సీఎం జగన్కు రోజుకు రూ.3 కోట్ల ఆదాయం
ఇసుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి రోజుకు రూ.3 కోట్ల ఆదాయం వస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
పాదయాత్రలో నారా లోకేశ్
ఈనాడు, కర్నూలు: ఇసుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి రోజుకు రూ.3 కోట్ల ఆదాయం వస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్ర ఆదివారం నంద్యాల జిల్లా ఆత్మకూరు, వెలుగోడు మండలాల పరిధిలో కొనసాగింది. మొత్తం 16.2 కి.మీ. నల్లమల ప్రాంతంలో కొనసాగింది. ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు, ఇండియా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్దిఖి తదితరులు నారా లోకేశ్ను కలిశారు. పాదయాత్రలో నడుస్తూనే పులుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాబోయే తరాలకు మంచి జీవితాన్ని అందించాలన్న ఆశయంతో అడవులు, పులులు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్నామని ఇమ్రాన్ సిద్దిఖి లోకేశ్కు వివరించారు. అనంతరం వెలుగోడు విడిది కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో ఆదివారం ముఖాముఖి నిర్వహించారు.
లోకేశ్ మాట్లాడుతూ తెదేపా హయాంలో ఇసుక ధరతో పోలిస్తే ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగిందని అన్నారు. జగన్ పాలనలో సిమెంటు ధర రెట్టింపైందని.. భారీగా సిమెంటు ధర పెరగడం గతంలో ఏ ప్రభుత్వాల సమయంలోనైనా జరిగిందా అని ప్రశ్నించారు. కొందరు మాఫియా ముఠాగా మారి ధరలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి సిమెంట్ బస్తాపై జగన్కు వాటా వెళ్తుందని... అందుకే సిమెంట్ ధర అంతగా పెరిగిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులేనని పేర్కొన్నారు. కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టకుండా పాత ఇసుక విధానాన్ని రద్దు చేయడంతో నెలలపాటు పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారని... ఆ డబ్బంతా ప్రస్తుతం ఎవరు దోచుకుంటున్నారని ప్రశ్నించారు. పెరిగిన ధరలతో సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికీ పనులు లభించేలా చూస్తాం
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకొచ్చి ధరలు తగ్గిస్తామని లోకేశ్ ప్రకటించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మళ్లీ మొదలుపెడతామని, భవన నిర్మాణ కార్మికులందరికీ పనులు దొరికేలా చూస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
పిల్లకాల్వ అయినా తవ్వించావా జగన్?
రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నై వాసులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో వెలుగోడు వద్ద నిర్మించిన తెలుగు గంగ జలాశయాన్ని యువనేత సందర్శించారు. 16.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా సీమలోని 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నైకి తాగునీరు అందుతోందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1996 సెప్టెంబరు 23న ఈ ప్రాజెక్టు నుంచి తొలిసారి చెన్నైకి తాగునీరు వెళ్లిందని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబుల ముందుచూపు, కరవు సీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కోసం ఒక్క పిల్లకాల్వ అయినా నిర్మించావా జగన్ అంటూ లోకేశ్ ప్రశ్నించారు.
నేడు పాదయాత్రలో పాల్గొననున్న భువనేశ్వరి
నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 99 రోజులు పూర్తి చేసుకుంది.. సోమవారం వందవ రోజుకు చేరుతుంది.. లోకేశ్ తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేశ్ చిన్ననాటి స్నేహితులు యాత్రలో పాల్గొంటారు. భువనేశ్వరి ఆదివారం రాత్రి బోయరేవుల క్యాంప్ సైట్కి చేరుకున్నారు. మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?