Siddaramaiah: మొగ్గు సిద్ధరామయ్య వైపేనా!
కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రులు ఎందరనేదే ప్రశ్న
ఈడీ, ఐటీ కేసులు డీకేకు అడ్డంకిగా మారవచ్చని సమాచారం
ఈనాడు-దిల్లీ, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీని శివకుమార్ అన్ని విధాలా ముందుకు నడిపించి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించినప్పటికీ ఆయనపై ఉన్న ఈడీ, ఆదాయపు పన్ను కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారవచ్చని తెలుస్తోంది. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే భాజపా నాయకత్వం మరింత గురిపెట్టి ఏదోవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుందని, అది కాంగ్రెస్కు మున్ముందు సమస్యగా మారుతుందన్న ఉద్దేశంతో సిద్ధరామయ్యవైపు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా శివకుమార్కు కీలకమైన మంత్రి పదవులతో ఉపముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికల్లో మిగతా మైనార్టీలు, ఎస్సీ సామాజిక వర్గం కూడా దోహదం చేసిన నేపథ్యంలో ఆ వర్గాలవారికీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒకటికి మించిన డిప్యూటీ సీఎంలు ఉంటే తనకు ప్రాధాన్యం ఉండదన్న కారణంతో శివకుమార్ ఆ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని డీకే పట్టుబడితే మిగతా వర్గాలకు ఎలా నచ్చజెప్పాలన్న అంశంపైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని తనకు అప్పగిస్తూ సీఎల్పీలో తీర్మానం చేసినా పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్లతో సంప్రదించాకే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఇద్దరినీ ఒప్పించాక నేడే ప్రకటన..!
2024 పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ పనితీరు కనబరచాలంటే డీకే శివకుమార్ సేవలు చాలా అవసరమని, ఆ నేపథ్యంలో ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తేవడం సాధ్యంకాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలిపించుకోవాంటే సిద్ధరామయ్య, శివకుమార్లు ఇద్దర్నీ ఒప్పించి ముందుకు నడిపించడం అత్యంత అవసరమని పార్టీ భావిస్తోంది. డీకేను కూడా దిల్లీకి పిలిపించి చర్చించి, ఒప్పించిన తర్వాతే సిద్ధరామయ్య పేరును అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇదంతా మంగళవారమే జరుగుతుందని పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడినని, పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించిన తనను పార్టీ అధిష్ఠానం ఏ విధంగా సంతృప్తిపరుస్తుందో ఎదురుచూస్తున్నానని డీకే పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలూ తన మద్దతుదారులేనంటూ.. తాను సీఎం రేసులో ముందున్నానని చెప్పకనే చెబుతున్నారు. వాస్తవానికి సోమవారం డీకే కూడా దిల్లీ వెళ్లాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో అనారోగ్య కారణమంటూ ఆగిపోయారు. మంగళవారం ఆయన దిల్లీకి వెళ్తారని సోదరుడు డీకే సురేశ్ తెలిపారు.
నిర్ణయానికి ఎక్కువ సమయం పట్టదు
సూర్జేవాలా
70 మంది శాసనసభ్యులు రాతపూర్వకంగా, 60 మంది రహస్య ఓటింగ్ ద్వారా వెల్లడించిన అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ నేతలు సోమవారం దిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై సమాలోచనలు జరిపారు. అభిప్రాయాలు బహిరంగంగా చెప్పడానికి కొందరు ఎమ్మెల్యేలకు ఉన్న ఇబ్బంది దృష్ట్యా వారు రహస్య బ్యాలెట్ కూడా నిర్వహించి ఆ పెట్టెలను తమతోపాటు దిల్లీకి తెచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు ఖర్గేకు ఎక్కువ సమయం పట్టదని పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ‘సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలతో రూపొందించిన నివేదిక రహస్యమైనది. దానిని మేం బయటపెట్టలేం. ఖర్గే మాత్రమే బహిర్గతం చేస్తారు’ అని శిందే చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి