Karnataka Congress: సంకేతాలున్నా మేలుకోలేదు
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డి.కె.శివకుమార్ను నియమించిన తొలిరోజు నుంచే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు తెరలేచింది.
అందుకే కర్ణాటక సీఎం పదవిపై ఇంత చిక్కుముడి
ఊహించని ఘన విజయంతో పెరిగిన పోటీ
సర్దుబాటు చేయలేక ఆపసోపాలు
ఈనాడు, బెంగళూరు
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డి.కె.శివకుమార్ను నియమించిన తొలిరోజు నుంచే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సిద్ధరామయ్య, డీకే మధ్య పోటీ ఉంటుందని పార్టీ అధిష్ఠానానికీ తెలిసిన అంశం. ఎన్నికలకు ముందే వీరిమధ్య సయోధ్య కుదిర్చి ఉంటే ప్రస్తుతం దిల్లీ స్థాయిలో పంచాయితీ అవసరం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్ఠానంతో పాటు కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉదాసీనంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని అన్ని పార్టీల మాదిరిగా కాంగ్రెస్ కూడా ఆశాభావంతో ఉన్నా, ఇంతటి విజయం ఊహించనిది. బొటాబొటి మెజార్టీ అయినట్లయితే సిద్ధరామయ్య, డీకేలలో ఎవరో ఒకరు సర్దుకుపోయేవారేమో. జేడీఎస్ను కింగ్ మేకర్ను చేసే హంగ్కు గానీ, భాజపాకు ఆపరేషన్ కమలకు అవకాశం గానీ ఇవ్వని స్థాయిలో కాంగ్రెస్ విజయం సాధించటంతో అందుకు తామే కారణమనే భావన ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరో ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి అంతకాలం వరకు సురక్షితంగా అధికారంలో ఉండే అవకాశాన్ని వదులుకునేందుకు ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేతలే కాదు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరు. ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గంలో చోటు వంటి డిమాండ్లతో ఎమ్మెల్యేలు ఎవరికివారు పావులు కదుపుతున్నారు.
అధికార పంపిణీకి ససేమిరా
రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ పోరుకు, తాజా కర్ణాటక కాంగ్రెస్ రాజకీయానికి పోలికలు మొదలయ్యాయి. సిద్ధరామయ్యకు అవకాశం ఇస్తే తన పరిస్థితి కూడా సచిన్ పైలట్లా మారుతుందన్న భయం శివకుమార్కు లేకపోలేదు. ఆ కారణంగానే తనను పూర్తిస్థాయి ముఖ్యమంత్రిని చేయాలని, లేదంటే ఇలాగే వదిలేయండని అధిష్ఠానానికి తెగేసి చెబుతున్నారు. సిద్ధరామయ్య ప్రతిపాదించిన 50:50 అధికార పంపిణీ ప్రతిపాదనను ససేమిరా అనేందుకు ఇదే కారణమని తెలుస్తోంది. తన వల్లనే పాతమైసూరులో ఒక్కలిగ స్థానాలు దండిగా వచ్చినట్లు ఆయన గట్టిగా చెబుతున్నారు. రాష్ట్రంలో దళితులు, ముస్లింలు, లింగాయత్లు కలిసి ఓటేస్తేనే 135 సీట్లు వచ్చాయని చెబుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి డా.జి.పరమేశ్వర్, ఎం.బి.పాటిల్, జమీర్ అహ్మద్ వంటివారు కూడా సీఎం కుర్చీకి పోటీ పడుతున్నారు. 2013 ఎన్నికల సమయంలో సిద్ధరామయ్యతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న పరమేశ్వర్ ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈసారి ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. డీకే, సిద్ధూల మధ్య సయోధ్య కుదర్చలేని స్థితి కొనసాగితే పరమేశ్వర్ను, సుదీర్ఘ కాలం తర్వాత లింగాయత్లకు అవకాశం ఇవ్వాల్సి వస్తే ఎంబీ పాటిల్ను అదృష్టం వరించే అవకాశం లేకపోలేదు. చిట్టచివరి అస్త్రంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే ముఖ్యమంత్రిని చేస్తే సిద్ధరామయ్య, డీకేలు నోరు మెదిపే అవకాశాలు ఉండవనే విశ్లేషణా కీలకంగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు