Karnataka Elections 2023: కుదరని రాజీ
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించటంపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతూనే ఉంది. బెంగళూరు నుంచి దిల్లీకి మారిన ప్రహసనం బుధవారం నాటకీయ పరిణామాలకు దారితీసింది.
కర్ణాటక సీఎం ఎంపికపై హస్తినలో రోజంతా హైడ్రామా
72 గంటల్లోపు కొత్త కేబినెట్ ఏర్పాటవుతుందన్న సూర్జేవాలా
దిల్లీ, ఈనాడు - బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించటంపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతూనే ఉంది. బెంగళూరు నుంచి దిల్లీకి మారిన ప్రహసనం బుధవారం నాటకీయ పరిణామాలకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి కానున్నారన్నది విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, తర్వాత డీకే శివకుమార్ సీఎంలుగా ఉంటారనే ప్రచారం జరిగింది. 2013 మే 13న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన బెంగళూరులోని కంఠీరవ స్టేడియం మళ్లీ అదే వేడుక కోసం ముస్తాబవుతుండగా దిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన ప్రకటన దానికి కారణం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తారని, మరో 48-72 గంటల్లో కేబినెట్ ఏర్పాటవుతుందని ఆయన స్పష్టంచేశారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు.
ఖర్గే, సోనియాలతో ఎడతెగని చర్చలు
దిల్లీలోనే తిష్టవేసిన సిద్ధరామయ్య బుధవారం ఉదయమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపు 45 నిమిషాలు చర్చించారు. అనంతరం నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. గంటపాటు చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. చర్చల వివరాలేవీ వెల్లడించకుండా వారు మౌనం వహించారు. సిద్ధరామయ్య తర్వాత ఖర్గే, సోనియా నివాసాలకు డీకే వెళ్లి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా తారుమారైంది. సిద్ధూ, డీకే కూడా రాహుల్గాంధీతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి శివకుమార్ నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. బయటకు వచ్చిన శివకుమార్.. ప్రసార మాధ్యమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లు రాసుకుంటే నేనెందుకు సమాధానమివ్వాలి’ అని ప్రశ్నించారు. సోనియాతో శివకుమార్ ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. ఆమె సూచన మేరకే ఖర్గేతో ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
అందరూ ఊహిస్తున్నట్లే సీఎం పదవీ కాలాన్ని డీకే, సిద్ధరామయ్య పంచుకోవాలన్న ప్రతిపాదన దిల్లీ చర్చల్లో వచ్చినట్లు సమాచారం. సిద్ధరామయ్య మొదటి నుంచీ ప్రతిపాదిస్తున్నట్లే ఖర్గే, సోనియాగాంధీ ఈ విధానానికి ఆమోదించినట్లు తెలిసింది. ఈ సమయంలో డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన కోరుకున్న శాఖలు ఇచ్చేందుకు కూడా అధిష్ఠానం అంగీకరించినట్లు సమాచారం. సీఎం తప్ప మరే స్థానం అవసరం లేదని తెగేసి చెప్పిన డీకే.. బెట్టును కొనసాగించారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత 50:50 సూత్రానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లకు తానే సీఎంగా ఉండాలన్న నిబంధనకైతేనే అంగీకరిస్తానని డీకే స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఎలాంటినిర్ణయం రాలేదు.
సిద్ధూ శిబిరంలో సంబరాలు
సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారాన్ని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర ఖండ్రే అందించటంతో సిద్ధరామయ్య స్వగ్రామంతో పాటు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు