Yuvagalam: నేటి నుంచి కోనసీమలో ‘యువగళం’
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు.
లోకేశ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభం
ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. 79 రోజుల విరామం తర్వాత నేటి ఉదయం 10.19 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి తెదేపా శ్రేణులతో పాదయాత్రగా బయలుదేరనున్నారు. సెప్టెంబరు 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజు తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేశ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా.. ఈ సారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కి.మీ. నుంచి 20 కి.మీ. మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ ముందుకు సాగనున్నారు.
తెలుపు, పసుపు జెండాల రెపరెపలు: పాదయాత్ర ప్రారంభానికి పార్టీ ప్రధాన నాయకులతో పాటు 175 నియోజకవర్గాల తెదేపా ఇన్ఛార్జులు రానున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కోనసీమ చేరుకున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్బాబు తదితరులు పొదలాడ చేరుకుని నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ‘యువగళం’ వాలంటీర్లు వంద మంది సేవలకు సన్నద్ధమయ్యారు. పాదయాత్ర సాగే మార్గంలో లోకేశ్, జనసేన అధినేత పవన్కల్యాణ్ చిత్రాలు, తెదేపా, జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాదయాత్ర పొదలాడ నుంచి 2 కి.మీ. వెళ్లాక తాటిపాక కూడలి వస్తుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించి, లోకేశ్ ప్రసంగిస్తారు. తొలిరోజు 15.4 కి.మీ. నడిచి.. అమలాపురం నియోజకవర్గం పెరూరులో రాత్రి బస చేయనున్నారు. ఆదివారం రాత్రి లోకేశ్ పొదలాడ చేరుకున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు స్థానిక తెదేపా శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి