Nara Lokesh: దళితుల్ని ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం
‘‘జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు.
జగన్ పాలనలో ఆరు వేల మందిపై దాడులు
‘దళిత గళం’ ముఖాముఖిలో లోకేశ్
ఈనాడు, కాకినాడ: ‘‘జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు. ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శీలంవారిపాకల వద్ద ఆదివారం సాయంత్రం ‘దళిత గళం’ ముఖాముఖిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో మాట్లాడారు. మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. లోకేశ్ పలువురి ప్రశ్నలు, సమస్యలు విని సమాధానం ఇచ్చారు.
సుబ్రహ్మణ్యం కేసు సీబీఐకి అప్పగిస్తాం
‘‘మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి చంపేశారు.. చీరాలలో కొవిడ్ సమయంలో మాస్కు పెట్టుకోలేదని కిరణ్ను కొట్టి చంపేశారు.. గుంటూరు జిల్లాలో రమ్యను, సీఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్యచేస్తే నేటికీ చర్యలు లేవు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి డోర్డెలివరీ చేసిన అనంతబాబును సీఎం వెంటేసుకుని తిరుగుతున్నారు’’ అని లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుబ్రహ్మణ్యం కేసు సీబీఐకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
దాడిచేసింది వారు... మాపై నింద
నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలిశానా అని లోకేశ్ అడిగిన ప్రశ్నకు ఇదే మొదటిసారని కోడికత్తి శ్రీను కుటుంబీకులు తెలిపారు. ‘‘ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా చూశాం.. బాబాయ్ గుండెపోటు డ్రామా చూశాం.. దాడిచేసింది వారు.. నింద మాపై వేశారు.. ముఖ్యమంత్రి వాయిదాలకు వెళ్లరు.. విచారణకూ సహకరించరు. దళిత యువకుడిని అయిదేళ్లుగా జైలులో పెట్టారు’’ అని లోకేశ్ అన్నారు. నాలుగేళ్ల జగన్ పాలనలో ఆరు వేల మంది దళితులపై దాడులు జరిగాయన్నారు.
లోకేశ్ యువగళం పాదయాత్ర 216వ రోజు ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం ఉప్పాడ కొత్తపల్లి మండలం యండపల్లి కూడలిలోని శిబిరం నుంచి ప్రారంభమై శీలంవారిపాకల కూడలిలోని శిబిరం వద్దకు చేరుకుంది.
మా బిడ్డను చంపిన అనంతబాబు ధైర్యంగా తిరుగుతున్నారు
‘మా బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు ధైర్యంగా తిరుగుతున్నారు. మేము ఎవరికీ లొంగం.. దేనికీ భయపడం.. మీరంతా మాకు అండగా నిలబడాలి. బిడ్డను కోల్పోయి కుమిలిపోతుంటే చంద్రబాబు అండగా నిలబడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సీబీఐ విచారణ జరిపించి, దోషులను శిక్షిస్తారనే నమ్మకంతో బతుకుతున్నాం.’
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆవేదన
చేయని నేరానికి అయిదేళ్లుగా జైల్లో పెట్టారు
‘జగన్పై దాడిచేశాడని మా తమ్ముడిని అయిదేళ్లుగా జైలులో పెట్టారు. వాడు ఏ తప్పూ చేయలేదు. మా ఊరొచ్చినప్పుడు జగన్ను కలవాలని ప్రయత్నిస్తే మా ఇంటిచుట్టూ పోలీసులను కాపలా పెట్టించారు. మా న్యాయవాది సలీంనూ ఇబ్బంది పెట్టాలని చూశారు. దళిత నేత వెంకటరావు మాకు సాయం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆయన ఇంటినీ చుట్టుముట్టారు.’
జనిపల్లి శ్రీను (కోడికత్తి నిందితుడు) సోదరుడు సుబ్బరాజు వేదన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు