Uttam Kumar Reddy: కాళేశ్వరం.. స్వతంత్ర భారతంలో భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్
స్వతంత్ర భారతదేశంలోనే భారీ కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈనాడు డిజిటల్-జయశంకర్ భూపాలపల్లి, మహదేవపూర్-న్యూస్టుడే: స్వతంత్ర భారతదేశంలోనే భారీ కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టిన ఈ ప్రాజెక్టులో రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి.. 98 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చారన్నారు. దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదని, పూర్తి చేయాలంటే ఇంకా రూ.40 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగిపోతే.. నేటికీ భారాస నేతలెవరూ రాలేదన్నారు. ఆనాడు చీఫ్ డిజైనర్గా, చీఫ్ ఇంజినీర్గా మారిన కేసీఆర్.. దీనిపై నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ సరిగ్గా లేదని తేల్చారని తెలిపారు. వర్షాకాలం ముందు, తర్వాత ఎప్పుడూ నిర్వహణ చేపట్టలేదని ఆరోపించారు. రూ.100 పనికి రూ.500 ఖర్చు చేశారన్నారు. దీనిపై క్రిమినల్ విచారణ చేపడతామని పేర్కొన్నారు.
కేసీఆర్ సూచనతోనే మేడిగడ్డకు భాజపా ఎమ్మెల్యేలు రాలేదు: పొన్నం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సలహాతోనే భాజపా ఎమ్మెల్యేలు మేడిగడ్డకు రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. భాజపా కేవలం ఆరోపణలకే పరిమితమైందన్నారు. ఇదంతా లోక్సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాదని.. ఆ రెండు పార్టీల నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు.
ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా: శ్రీధర్బాబు
ప్రాజెక్టు వస్తే ప్రజలకు మేలు కలుగుతుందని భావించి.. మూడు బ్యారేజీలకు ఎంతోమంది రైతులు తమ భూములను, ఇళ్లను త్యాగం చేశారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల వారికి చుక్కనీరు రాకున్నా భూములిచ్చారని తెలిపారు. జయశంకర్ జిల్లాలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పదేళ్లు పక్కన పెట్టారని, దాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
ప్రాజెక్టును ఈ స్ధితిలో చూడటం బాధాకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవి మేడిగడ్డ పగుళ్లు కావని.. తెలంగాణ ప్రజల గుండె పగుళ్లని పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులూ పనికిరావని అంటున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డను నాణ్యతలోపంతో నిర్మించినవారిని, డిజైన్ చేసినవారిని జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ చెప్పినవన్నీ అసత్యాలే..
రాష్ట్ర మంత్రుల ధ్వజం
ఈనాడు, హైదరాబాద్: నల్గొండ సభలో కేసీఆర్ అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రులు ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.
నల్గొండ జిల్లాకు నష్టం చేశారు
- కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ జిల్లాకు నష్టం చేసిందే కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టి 299 టీఎంసీల కృష్ణా జలాల వాటాకు అంగీకరించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో 70 శాతం నిర్మితమైన ప్రాజెక్టులను కూడా గత పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తిచేయకుండా మళ్లీ లోక్సభ ఎన్నికలు రాగానే నాటకాలు మొదలుపెట్టారు. అబద్ధాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
పదేళ్లలో తెలంగాణకు అన్యాయం
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ నిజాలు మాట్లాడుతారని భావించాం. తన సహజ పద్ధతిలో అబద్ధాలే చెప్పారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు రాని కేసీఆర్ను పులి అంటారా? పిల్లి అంటారా? గతంలో ఎన్నడూలేనంతగా అన్యాయం, అవినీతి, దోపిడీ గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది. ఇప్పుడేమో ఏమీ ఎరుగనట్లు కేసీఆర్ నటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరోపణలు చేస్తున్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే
- జూపల్లి కృష్ణారావు
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చేందుకే నల్గొండ సభ పేరుతో నాటకాలు ఆడారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? గత తొమ్మిదిన్నరేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను గాలికి వదిలేసి హడావుడిగా నిర్మించి రూ.వేల కోట్ల ప్రజల సొమ్మను నీటిపాలు చేశారు.
అసహనంతోనే కేసీఆర్ వ్యాఖ్యలు
- తుమ్మల నాగేశ్వరరావు
నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనం. కృష్ణా జలాల అప్పగింతకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విధ్వంసానికి మూలకారణమైన ఆయన రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం దారుణం. ఆయన తొందరపాటు వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఇకనైనా ఆయన అసహనాన్ని మాని ఓపిక పట్టాలి. వాస్తవాలు తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్