వాలంటీర్లతో దున్నేద్దాం
వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా.. ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా.. వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లను యథేచ్ఛగా వాడుకుంటున్నారు.
ప్రతి బూత్లో 60% ఓట్లు మనకే పడాలి
గృహసారథులతో కలిసి ఇంటింటికీ తిరిగి వైకాపాకే ఓటేసేలా ఒప్పించాలి
సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా బూత్ కమిటీల శిక్షణ తీరు
ఈనాడు, అమరావతి: వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా.. ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా.. వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ బూత్ పరిధిలోనూ వారి సాయంతో వైకాపాకు 60% ఓట్లు పడేలా చూడాలని నాయకులకు లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మండలస్థాయి, సచివాలయ స్థాయి సమన్వయకర్తలకు ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణలో.. ఈ మేరకు సూచించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి బూత్లో 60% ఓట్లు సాధించాలని నాయకులకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శిక్షణలో భాగంగా చెప్పిన వాటిలో కొన్ని వివరాలు...
బూత్లవారీగా ట్రాకింగ్
వైకాపా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్ ప్రతినిధులు, ఐటీ నిపుణుడు లోకేశ్వరరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బూత్ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై వివరించారు. బూత్లవారీగా గత ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉంది?.. ఎక్కడెక్కడ అప్పట్లో తెదేపాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే వివరాలను వెల్లడించారు. బూత్ స్థాయిలో ఓటరు జాబితాను ఎలా నిర్వహించుకోవాలి? అందులో తెదేపా/జనసేన ఓటర్లు, తటస్థ ఓటర్లు, వైకాపా సానుకూల ఓటర్లు అనేది స్పష్టంగా ఎలా వర్గీకరించుకోవాలి? వంటివాటిపై శిక్షకులు ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకు పైగా పోలింగ్ బూత్లు ఉంటే.. ఇప్పటివరకూ 43 వేలకు పైగా బూత్ కోర్ కమిటీలను సన్నద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కమిటీల్లో ముగ్గురు కోర్ సభ్యులు ఉంటారని, వారికి వాలంటీర్లు, గృహసారథులను అనుసంధానంగా పనిచేస్తారని వివరించారు. అంటే, ప్రతి కమిటీలో వాలంటీర్లు తప్పనిసరిగా ఉంటారన్నమాట.
‘రాష్ట్రవ్యాప్తంగా 80ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులు కలిపి 10లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా ఈసారి ఇంటినుంచే ఓటు వేసే వెసులుబాటు ఉండనుంది. ఆ అవకాశాన్ని పొందేందుకు వారందరూ సకాలంలో దరఖాస్తు చేసేలా చూసుకోవాలి.. బూత్ కమిటీలు వీరి ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. దగ్గరుండి దరఖాస్తు చేయించి, వారికి అవకాశం వచ్చేవరకు ఫాలోఅప్ చేయాలి’ అని చెప్పారు.
- తెదేపా/జనసేన ఓటర్లు.. తటస్థ ఓటర్లు అని వర్గీకరించి, వారు వైకాపా వైపు మొగ్గు చూపేలా ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
- బూత్లకు సంబంధించి కోర్ కమిటీల సభ్యులు, వాలంటీర్లు, గృహ సారథులతో పాటు గడప గడపకు వెళ్లి ప్రతి ఇంట్లోని వారితో మాట్లాడి వారంతా వైకాపాకు ఓటేసేలా ఒప్పించాలి.
- వైకాపా సానుకూల ఓటర్లంతా 100% పోలింగ్ రోజున వచ్చి ఓటేసేలా మొబిలైజేషన్ బాధ్యతను వాలంటీర్లు, గృహసారథులకు అప్పగించాలి.
- పోలింగ్ రోజున బూత్ల కోర్ కమిటీ సభ్యులంతా చురుగ్గా ఉండి, ఆ బూత్లో 60% ఓట్లు వైకాపాకు పడేలా సమన్వయం చేయాలి.
- పోలింగ్ రోజు వరకూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. అందులో జగన్ ప్రభుత్వం గురించి సానుకూల ప్రచారం చేయాలి.
ఇలాంటి పలు అంశాలతోపాటు.. క్షేత్రస్థాయిలో వైకాపాకు మద్దతుగా సానుకూల ప్రచారాన్ని జనంలో ఎలా చేపట్టాలనేది కూడా వివరించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు కూడా బూత్స్థాయిలో ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్