రైతులపై పగ పట్టకండి.. కోపం ఉంటే మాపై తీర్చుకోండి
మేడిగడ్డ బ్యారేజీలోని 85 పిల్లర్లలో ఒక పిల్లర్లో మాత్రమే సమస్య తలెత్తిందని, చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తూ రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలి
ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు
1.6 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్ల పరిధిలోనే సమస్య
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
‘చలో మేడిగడ్డ’ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న పార్టీ నేతలు
ఈనాడు, పెద్దపల్లి; ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి; కాళేశ్వరం, మహదేవపూర్, న్యూస్టుడే: మేడిగడ్డ బ్యారేజీలోని 85 పిల్లర్లలో ఒక పిల్లర్లో మాత్రమే సమస్య తలెత్తిందని, చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తూ రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ 1.6 కిలోమీటర్ల పొడవు ఉండగా అందులో 50 మీటర్ల పరిధిలో మాత్రమే సమస్య ఉందని, దీనిని బ్రహ్మాండంగా పునరుద్ధరించి తిరిగి వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారని చెప్పారు. భారాస ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఆ పార్టీ నేతలు సందర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మల్లారెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సబిత, శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఇంజినీరింగ్ నిపుణులు ప్రకాశ్, వెంకటేశ్, దామోదర్రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉదయమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు, వాహనాల్లో బయల్దేరిన నేతలకు దారి పొడవునా భారాస శ్రేణులు స్వాగతం పలికాయి. భూపాలపల్లిలోని భారాస కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుంచి నేతలు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. బ్యారేజీ కిందకు దిగి 20వ పిల్లర్ వద్ద పరిశీలించారు. అక్కడ కేటీఆర్ నాలుగు నిమిషాలు ఉన్నారు. సాయంత్రం 5.40 గంటలకు అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకుని దిగువ ప్రాంతాన్ని కొద్దిసేపు పరిశీలించిన అనంతరం సభాస్థలికి చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద కొద్దిసేపు మీడియాతోనూ, అన్నారం సభలోను కేటీఆర్ మాట్లాడారు. చలో మేడిగడ్డ మొదటి సందర్శన అని త్వరలో మిగిలిన ప్రాజెక్టులను సందర్శించి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.
అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోండి
‘‘మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రైతులపై, రాష్ట్రంపై పగ పట్టకండి. నీళ్లు లేక ఇప్పటికే కరీంనగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయండి. సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టండి. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోండి. వచ్చే వానాకాలంలో వరద వచ్చేనాటికి బ్యారేజీని పునరుద్ధరించండి. నీళ్లు ఎత్తిపోస్తే రైతులకు న్యాయం జరుగుతుంది.
కడెం ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది
ప్రాజెక్టుల్లో సమస్యలు తలెత్తడం కొత్తేమీ కాదు. కడెం ప్రాజెక్టు రెండు సార్లు, గుండ్లవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయాయి. సాగర్లో, శ్రీశైలంలో లీకేజీలు వచ్చాయి. కానీ మేం ఎప్పుడూ రాజకీయంగా మాట్లాడలేదు.
రాజకీయ లబ్ధికి యత్నం
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేసి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోంది. కేసీఆర్ నల్గొండలో సభ తలపెడితే అదే రోజు సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనను ఏర్పాటు చేశారు. చలో మేడిగడ్డ కార్యక్రమానికి మేము పిలుపునిస్తే వారు పాలమూరు-రంగారెడ్డి పథకం సందర్శన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. కామధేనువు లాంటి కాళేశ్వరానికి మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు మానుకుని తక్షణమే పునరుద్ధరణపై దృష్టి సారించాలి’’ అని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ద్వారానే కొత్తగా 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు: కడియం
అన్నారం ప్రాజెక్టు వద్ద స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ‘పవర్ పాయింట్ ప్రజంటేషన్’ ద్వారా కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని వివరించారు. కడియం మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా కొత్తగా 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి వద్ద తలపెట్టిన ప్రాజెక్టుకు, భారాస చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న తేడాను డిజిటల్ తెరపై దాదాపు గంటసేపు వివరించారు. తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే ప్రాణహిత- గోదావరి కలిసే ప్రాంతంలో దిగువన మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చిందన్నారు.
చలో మేడిగడ్డను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఈనాడు, వరంగల్: చలో మేడిగడ్డకు పలుచోట్ల నిరసనలు ఎదురయ్యాయి. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలో యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దేవన్నపేట క్రాస్ వద్ద స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గుమిగూడి ‘గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి స్థానిక భారాస నేతలు కూడా రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్ది చెప్పి పంపించివేశారు.
పేలిన బస్సు టైరు
జనగామ జిల్లా నెల్లుట్ల క్రాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సుల్లో వెనకాల వస్తున్న ఒక బస్సు టైరు పేలింది. అందులో కొందరు భారాస నేతలు, విలేకరులు ప్రయాణిస్తున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
భారాస కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట
మేడిగడ్డ బ్యారేజీ వద్దకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు బ్యారేజీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు నిలువరించారు. ప్రత్యేక బస్సుల్లో భారాస బృందం మేడిగడ్డకు చేరుకోగానే ఆ సమయంలోనే కార్యకర్తలు ఒక్కసారిగా బ్యారేజీ గేటు వద్దకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గేటు దాటి లోపలికి వెళ్లడానికి మరోసారి తీవ్రమైన ప్రయత్నం చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంత మంది కార్యకర్తలు కింద పడిపోయారు. భారాస బృందం వెళ్లడానికి బ్యారేజీ గేటు తీయడంతో ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకెళ్లారు. పోలీసులు పూర్తిగా పట్టు కోల్పోవడంతో భారాస కార్యకర్తలు బ్యారేజీపైకి చేరుకున్నారు. భారాస బృందం బ్యారేజీ దిగువకు చేరుకొని పరిశీలించింది.
పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు
మాజీ మంత్రి హరీశ్రావు
తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంతో ఘనత ఉందని.. వరదలతో స్వల్పంగా కూలిన మేడిగడ్డ పిల్లర్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి వచ్చే వానాకాలంలో రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగితే ఇప్పటి వరకు రేవంత్రెడ్డి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టలేదన్నారు. కుంగిన ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా ప్రజల దృష్టి మరల్చి కేసీఆర్ గొప్పతనాన్ని తగ్గించి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం ప్రకటించిన వెంటనే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించి ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన వెంటనే మరమ్మతు చేయిస్తామని ప్రకటించారన్నారు. ‘‘భారాస ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతాయుతంగా ప్రజల కోసం పని చేస్తుంది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు. మేడిగడ్డ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నష్టపోయినట్టు కాదు. కానీ సీఎం రేవంత్రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణకు వెంటనే ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేస్తే సూచనలు ఇస్తాం.
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు...
అవినీతికి కేరాఫ్గా ఉన్న కాంగ్రెస్ హయాంలో నాడు 33 ప్రాజెక్టులు జలయజ్ఞం అంటూ చేపట్టి ఒక్కటీ పూర్తి చేయకుండా ధనయజ్ఞంగా మార్చారు. రూ.1,450 కోట్ల దొంగ బిల్లులు సృష్టించిన చరిత్ర వారిది. తుమ్మిడిహెట్టి కోసం ఒప్పందం చేసుకోవడమే తప్ప తట్టెడు మట్టి ఎత్తలేదు. సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద నీటి నిల్వలు లేవు. వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇలాంటి కారణాలతోనే ప్రత్యామ్నాయంగా నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. భాజపా ప్రభుత్వం గుజరాత్లో చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని కూలిపోయాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో కొట్టుకుపోగా ఎన్డీఎస్ఏకు నివేదిస్తే ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు. మేడిగడ్డ కుంగిన రెండు రోజుల్లోనే నాణ్యత లోపాలతోనే కుంగిపోయిందని అది ప్రభుత్వానికి చెప్పకుండా మీడియాకు వెల్లడించడం రాజకీయ దురుద్దేశమే. నాగార్జున సాగర్ నుంచి కాళేశ్వరం వరకు ప్రాజెక్టుల అంచనా- ప్రతిపాదన- నిర్మాణ వ్యయాలకు మార్పులు ఉంటాయి’’ అని హరీశ్రావు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM