BJP : అధిష్ఠానం నుంచి కిషన్‌రెడ్డికి పిలుపు..

కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

Published : 09 Mar 2024 13:36 IST

హైదరాబాద్‌ : కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.  ఇవాళ మధ్యాహ్నం ఆయన దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీలో చేరికలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆదివారం దిల్లీలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డికి పిలుపు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని