సంక్షిప్త వార్తలు (10)
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేపట్టారు.
దిల్లీలో ఇండియా కూటమి సభ విజయవంతానికి సన్నాహాలు
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేపట్టారు. దీనికి సంబంధించి దిల్లీ, హరియాణా నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ ప్రతినిధి కూడా మహార్యాలీకి హాజరవుతారని విశ్వసనీయ సమాచారం.
పంజాబ్లో ఆప్ ఏకైక ఎంపీ భాజపాలో చేరిక
దిల్లీ: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ సుశీల్కుమార్ రింకూ బుధవారం భాజపాలో చేరారు. రింకూతో పాటు.. ఆప్ జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభం ఎదుర్కొంటున్న ఆప్నకు ఈ పరిణామం మింగుడుపడనిదే.
బక్క జడ్సన్కు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు
హైదరాబాద్, న్యూస్టుడే: కాంగ్రెస్ నేత బక్క జడ్సన్కు పీసీసీ క్రమశిక్షణ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో, ఛానళ్లలో బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే పార్టీ నియమ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలుతీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
అధికారం కోసం జగన్ అడ్డదారులు
సీఈవోకు ఎన్డీయే నాయకుల ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి: తిరుపతి జిల్లా రేణిగుంటలో వైకాపా నేతలు దాచిన తాయిలాలను సీజ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, భాజపా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, తెదేపా అధికార ప్రతినిధి షేక్ రఫీ, తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘ఓటమి భయంతో జగన్ అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు. ఇతర గోదాముల్లో పెద్దఎత్తున గడియారాలు, కుక్కర్లు, గొడుగులు, ఫ్యాన్లు, చీరలతో పాటు మరికొన్ని వస్తువులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.
వైకాపా తాయిలాల డంప్ బయటపడ్డ విషయంలో స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం తెదేపా నాయకులు ఫిర్యాదు చేస్తే.. బుధవారం సాయంత్రం వరకు వస్తువుల విలువ లెక్కించకుండా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. తిరుపతి నగరవ్యాప్తంగా ఇలాంటి డంప్లు మరిన్ని ఉన్నట్లు పేర్కొన్నారు.
వైకాపా నాయకుడితో కలిసి బైబిళ్లు పంచిన వాలంటీర్లు
అమలాపురం గ్రామీణం, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద వైకాపా నాయకుడితో కలిసి ఇద్దరు వాలంటీర్లు విద్యార్థులకు బుధవారం బైబిళ్లు పంపిణీ చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్ష కేంద్రంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల బయట రహదారిని ఆనుకుని ఓ దుకాణం వద్ద రంగాపురానికి చెందిన పాస్టర్, అమలాపురం మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మొసలి స్పర్జన్రాజు (వైకాపా) క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా విద్యార్థులకు బైబిళ్లు ఇచ్చేందుకు వచ్చారు. పరీక్ష రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు వాటిని ఇస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ కూడా ఇక్కడ పంపిణీ సరికాదని సూచించడంతో స్పర్జన్రాజు అక్కడినుంచి వెనుదిరిగారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు వైకాపా ప్రలోభాలు
విశాఖపట్నం (ఎంవీపీకాలనీ), న్యూస్టుడే: విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆటోడ్రైవర్లను వైకాపా కార్యాలయానికి పిలిపించి.. ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెదేపా వస్తే మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందని చెప్పి.. వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సీట్ల సర్దుబాటుపై రేపు నిర్ణయం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఈనెల 29న ఓ కొలిక్కి రానుంది. అదే రోజు హైదరాబాద్లో మూడు పార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఆయా మూడు పార్టీల నాయకులు విజయవాడలో ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపైనా ప్రాథమికంగా చర్చించారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించే సమావేశంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పులరాజు, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ తదితరులు పాల్గొననున్నారు.
వైకాపా హయాంలో గిరిజన మహిళలపై పెరిగిన దాడులు
తెదేపా పొలిట్బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో గిరిజన మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రశ్నించిన మహిళపై.. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైకాపా నాయకులకు మహిళలను అవమానించడం పరిపాటిగా మారింది. ఇటీవల పల్నాడు జిల్లాలో తాగునీరు అడిగిన గిరిజన మహిళ సామునిభాయిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మహిళలకు అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే ముందు జగన్ వస్తాడన్న వైకాపా నేతలు వీటికి ఏం సమాధానం చెబుతారు?’ అని సంధ్యారాణి ప్రశ్నించారు.
కంటెయినర్ వచ్చి వెళ్లడంపై విచారణ చేపట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
ఈనాడు, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్ అక్రమంగా వచ్చి వెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ‘భద్రతా సిబ్బంది రికార్డుల్లో నమోదు కాకుండా ఒక కంటెయినర్ సీఎం క్యాంపు కార్యాలయంలోకి రాంగ్రూట్లో వెళ్లడం, రెండో చెక్ పోస్టు వద్ద ఉండే ఆటోమేటిక్ స్కానర్ నుంచి కాకుండా వేరే దిశలో కంటెయినర్ను పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీఎం జగన్ పర్యటనల సందర్భంగా పరదాలు, ముళ్లకంచెలు కట్టి అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసు అధికారులు... కంటెయినర్పై ఏం సమాధానం చెబుతారు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రతిపక్షాల వాహనాల్ని పదేపదే తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అధికార పార్టీకి చెందిన నేతల వాహనాలను పట్టించుకోక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
పురందేశ్వరి ప్రతిష్ఠ దెబ్బతీసేలా సజ్జల భార్గవ్ తప్పుడు ప్రచారం
భాజపా నేత షేక్ బాజీ మండిపాటు
ఈనాడు, అమరావతి: భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వైకాపా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ మండిపడ్డారు. ‘పురందేశ్వరి, తెలుగుదేశం’ అనే పేరుతో ట్విటర్లో నకిలీ ఖాతా సృష్టించి, దాంతో తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో షేక్ బాజీ విలేకర్లతో మాట్లాడుతూ.. వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతుల్లో ఉండగా.. ఎన్నికల్లో వారిని ఉపయోగించుకునేందుకు వైకాపా ప్రభుత్వం వారితో రాజీనామా చేయించాలని కుట్ర పన్నుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM