ఫోన్ ట్యాపింగ్లో ఎర్రబెల్లిదే కీలక పాత్ర.. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు
భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
లేబర్కాలనీ (వరంగల్), హైదరాబాద్, న్యూస్టుడే: భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన భర్త కొండా మురళీధర్రావుతో పాటు తన ఫోన్ను ట్యాప్ చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని నిజాలు బయటికి వస్తాయని, ట్యాపింగ్లో కీలక భూమిక పోషించిన పోలీసులతో పాటు తెరవెనుక ఉన్న పెద్దలను ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. వరంగల్లోని (తూర్పు ఎమ్మెల్యే) క్యాంపు కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకలాపాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాజపాకు వాటా ఉంది. మేఘా కృష్ణారెడ్డి భాజపాకు రూ. వందల కోట్లు విరాళంగా ఇచ్చారు. అందుకే కమలం పార్టీ కాళేశ్వరంపై నోరుమెదపడం లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కుమార్తె హోదాలో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందా చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం రూ.కోట్లకు పడగలెత్తింది’’ అని సురేఖ ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ శాఖ భూములను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్లకు శిక్ష తప్పదు: ఎమ్మెల్యే యెన్నం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఆదేశాల మేరకే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. తన ప్రమేయం లేకపోతే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ కేసులో ‘సిట్’ లోతైన దర్యాప్తు చేయాలి. నేనూ బాధితుడినే. ప్రతి నియోజకవర్గంలో బాధితులున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేయాలి. తెలంగాణలో నిఘా వ్యవస్థ దుర్వినియోగం కేంద్రానికి తెలియకుండానే జరిగిందా? రాష్ట్రంలో కాంగ్రెస్ను అణచివేసేందుకు భాజపా, భారాస కలిసి కుట్ర చేశాయి. అయినా ఆ పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు. కవిత జైలుకు వెళితే, ఎమ్మెల్సీ సీటు కోసం కేటీఆర్ గోవాలో క్యాంపు ఏర్పాటుచేసి చిందులేశారు’’ అని శ్రీనివాస్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్