కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు.
తెదేపా మాజీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి
ఈనాడు డిజిటల్, అమరావతి: దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. రూ.100 కోట్ల మద్యం కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉంటే, మద్యం వ్యాపారంలో రూ.లక్షల కోట్లు దోచుకున్న జగన్ మాత్రం బయట తిరుగుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చి పన్నుల పేరుతో రూ.వందలు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలను వైకాపా ప్రభుత్వం పెంచింది. ఏకంగా తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన జగన్కు అయిదేళ్లు ప్రజల కష్టాలు కనపడలేదు. వినపడలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలను విస్మరించారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన జగన్ మడమ తిప్పడంలో తనకు సరిలేరనేలా పాలన కొనసాగించారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక మద్యం మాఫియాను పెంచి పోషించారు. కల్తీ మద్యంతో వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. మరికొన్ని వేలమంది అనారోగ్యం పాలవడానికీ ఆయనే కారణం. ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో మద్యం వ్యాపారాన్ని కొనసాగించేలా అప్పులు తెచ్చారు. ఆయన ఆస్తుల్లాగే డ్రగ్స్లో కూడా రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపారు. గతంలో విజయవాడ చిరునామాతో గుజరాత్లో డ్రగ్స్తో పట్టుబడిన కంటెయినర్, ఇప్పుడు విశాఖలో డ్రగ్స్తో దొరికిన కంటెయినర్కు పాత్రధారులు, సూత్రధారులు వైకాపా నాయకులే’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం