లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి.
4, 8 తేదీల్లో నిర్వహణ
అచ్చెన్నాయుడు, పురందేశ్వరి, మనోహర్ల భేటీలో నిర్ణయం
ఈనాడు, అమరావతి: ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయం లక్ష్యంగా ఈ సమావేశాల్ని నిర్వహించనున్నారు. విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాసంలో బుధవారం రాత్రి జరిగిన మూడు పార్టీల ముఖ్యనేతల సమావేశం జరిగింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు, భాజపా నుంచి పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి అరుణ్సింగ్, సహ ఇన్ఛార్జి సిద్ధార్థసింగ్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. రెండు గంటలపాటు సమావేశంలో... ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టో రూపకల్పన, మూడు పార్టీల అగ్రనేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు.. తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు.
వారిపై ఫిర్యాదు చేయాలి
కోడ్ అమల్లోకి వచ్చాక కూడా రాష్ట్రంలో కొందరు అధికారులు వైకాపాకు కొమ్ముకాస్తూ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు భాజపా నేతల దృష్టికి తెచ్చారు. అలాంటి అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని, జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామనే భరోసాను ప్రజలకు భాజపా ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొనే ఎన్నికల సభల గురించి చర్చకు వచ్చినప్పుడు... ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున, రాష్ట్రంలో మూడు సభలకు హాజరయ్యే అవకాశం ఉందని భాజపా నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకొస్తే ప్రజలకు లభించే భరోసా, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఉమ్మడిగా కరపత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మూడు పార్టీల నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు
‘కేంద్రంలో 400 లోక్సభ స్థానాలు, రాష్ట్రంలో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఎన్డీయే అధికారంలోకి రావాలన్నది మా లక్ష్యం. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగు పెడుతుంది. వైకాపా పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా మూడు పార్టీలూ కలిసి పనిచేస్తాయి’ అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రచురించాల్సిన కరపత్రాలు, రూపొందించాల్సిన నినాదాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించినట్లు మనోహర్ వెల్లడించారు. ‘క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 4, 8 తేదీల్లో జరిగే సమావేశాల్లో అన్ని అంశాల్నీ సమన్వయం చేసుకుని, ఉమ్మడిగా ప్రజల్లోకి వెళతాం. అభివృద్ధే ధ్యేయంగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో కూటమి ప్రజల వద్దకు వెళుతోంది. వారు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అని పురందేశ్వరి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు