పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీపా దాస్మున్షీతో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ
ఈ నెల 31లోగా అభ్యర్థుల ఎంపికను కొలిక్కితెచ్చే యత్నం
హైదరాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని భావించినా నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే ప్రకటించింది. పెండింగ్లో ఉంచిన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నియోజకవర్గాలపై మరోసారి సర్వే చేసి తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 31న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) మరోసారి సమావేశం కానుంది. ఆ సమావేశంలోగా పెండింగ్ సీట్లను కొలిక్కితెచ్చేలా ఏఐసీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆశావహుల మధ్య సయోధ్య కుదిరేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌధరి, సభ్యులు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీతో నగరంలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు రోహిత్ చౌధరి, విష్ణునాథ్ ఇందులో పాల్గొన్నారు. పెండింగ్ స్థానాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల దీపా దాస్మున్షీ గాంధీభవన్లో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గాల ముఖ్యనేతలు, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను హరీశ్ చౌధరి బృందం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సర్వే వివరాలు, ఆశావహుల బలాబలాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌధరిని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ గురువారం రాత్రి విడివిడిగా కలిసి అభ్యర్థుల ఎంపికపై తమ అభిప్రాయాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!