బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు.
ఎన్డీయే నుంచి 12 మంది.. ఇండియా తరఫున ముగ్గురు..
ఈనాడు, దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. ఇందులో 6,122 రోజులపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరి నుంచి ఒక్క రోజు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన జగదాంబికా పాల్ వరకూ ఉన్నారు. వీరిలో చౌహాన్, సర్బానంద సోనోవాల్ మధ్యప్రదేశ్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో భాజపాను విజయ పథంలో నడిపించిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం పదవులను త్యాగం చేశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్లవ్ దేవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్థానిక వ్యతిరేకత, స్వపక్షంలో అసమ్మతి కారణంగా పదవులను వదులుకుని స్వరాష్ట్ర రాజకీయాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజ్నాథ్సింగ్ సభలో మెజారిటీని నిరూపించుకోలేకపోవడంతో వారి అనంతరం ఆ రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన జగదీష్ శెట్టర్, బసవరాజ్ బొమ్మైలు తమ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించలేక పదవులను కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్పార్టీతోపాటు, ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని బయటికెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆయన 2018లో తిరిగి కాంగ్రెస్లో చేరారు. అనంతరం 2023 ఏప్రిల్లో భాజపాలో చేరారు.
కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులుగా చేసిన దిగ్విజయ్ సింగ్, భూపేశ్ బఘేల్లదీ అదే పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నబంతుకి కూడా మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. రెండోసారి 2016 జులై 13 నుంచి 16 వరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి భాజపా అనుబంధంగా ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్గా మారడంతో నబంతుకి పదవి కోల్పోయారు. రాష్ట్రంలో పెమాఖండు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం సర్బానంద సోనోవాల్, బిప్లబ్ కుమార్ దేవ్, దిగ్విజయ్సింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ వారి పార్టీ అధిష్ఠానాలు.. స్థానిక అవసరాల రీత్యా లోక్సభ బరిలోకి దింపాయి. రాజ్నాథ్ సింగ్, జగదాంబికా పాల్, అర్జున్ ముండా ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉంటూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మిగిలినవారంతా కొత్తగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.
మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ కుమారుడైన హెచ్డీ కుమారస్వామి ఒకసారి భాజపా, ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం 2007లో భాజపాకు అధికారం బదలాయించాల్సిన సమయంలో ఆయన తిరస్కరించి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో స్వల్పకాలం రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 2018లో ఆయన నేతృత్వంలోని జేడీఎస్ మూడో పార్టీగా నిలిచినప్పటికీ భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మద్దతు పలకడంతో ఆయన రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టారు. 2019 జులైలో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో మెజారిటీ కోల్పోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవి నుంచి వైదొలిగిన రెండుసార్లూ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గ్రాఫ్ పడిపోవడంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ గత ఏడాది సెప్టెంబరులో ఎన్డీయే కూటమిలో చేరింది. ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. అందులో కుమారస్వామి మండ్య నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీనివల్ల సిట్టింగ్ ఎంపీ, సీనియర్ సినీ నటి సుమలత అక్కడి నుంచి భాజపా తరఫున పోటీ చేసే అవకాశం కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన