వైకాపాకు కాదు.. ప్రజలకు సేవ చేయండి
‘వాలంటీర్లు వైకాపాకు, ఆ పార్టీ నేతలకు కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలి. రాజీనామా చేశామని అనుకున్నా క్రిమినల్ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
క్రిమినల్ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బంది
వాలంటీర్లకు అచ్చెన్నాయుడి సూచన
కోటబొమ్మాళి, న్యూస్టుడే: ‘వాలంటీర్లు వైకాపాకు, ఆ పార్టీ నేతలకు కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలి. రాజీనామా చేశామని అనుకున్నా క్రిమినల్ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘వాలంటీర్లందరూ చదువుకున్న వారే. ప్రజాధనంతో పనిచేస్తున్నందున ప్రజలకు సేవ చేయాలి. వాలంటీర్లు లేకుంటే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో వైకాపా నేతలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెరుగైన వ్యవస్థగా తీర్చిద్ది మంచి జీతాలు, ఉపాధి శిక్షణతో ఉత్తమ అవకాశాలు కల్పిస్తాం. ఒకప్పుడు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు, పరిస్థితులు ఉన్నప్పుడు తెదేపా ఆవిర్భవించింది. అప్పటి పరిస్థితిని తలదన్నేలా మారిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంతో రక్షించుకోవలసిన ఆవశ్యకత ప్రజలందరిపైనా ఉంది’ అని అచ్చెన్న ఉద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!