‘వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే తిరిగి విదేశాలకు వెళ్లలేరు’
‘ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం.. వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్కడకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’ అని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్బాబు హెచ్చరించారు.
ప్రవాస భారతీయులకు వైకాపా అభ్యర్థి అశోక్బాబు హెచ్చరిక
వేమూరు, న్యూస్టుడే: ‘ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం.. వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్కడకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’ అని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. అమృతలూరు మండలం కూచిపూడిలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో అశోక్బాబు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒకవైపు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా.. బరిలో నిలిచిన అభ్యర్థి ప్రవాస భారతీయులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి. కానీ, అధికార పార్టీ అభ్యర్థి కావటంతో అధికారులు చూసీచూడనట్లు మిన్నకుండిపోయారు. ఇప్పటి వరకూ ఆ వ్యాఖ్యలపై కనీసం ఆరా కూడా తీయలేదు.
‘‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. తెదేపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైకాపా కార్యకర్తలు, నాయకుల వ్యవహారం చూస్తామని వారు బెదిరిస్తున్నారు. అదే.. వైకాపా అధికారంలోకి వస్తే అంతకు రెండింతలు చేస్తాం. వేమూరు నియోజకవర్గంలో గతంలో ఏ సంస్కృతి ఉందో నాకైతే తెలియదు. ఈసారి మాత్రం చాలా కఠినంగా ఉంటాం. మేము కూడా దేనికైనా సిద్ధం. ఎవరి ఓటు వారు వేసుకోవడానికి మీకు దమ్ము, సత్తా ఉందా? అని తెదేపా నాయకులను ఉద్దేశించి అశోక్బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొల్లూరు మండలంలో కొందరు నాయకులు కులాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైకాపాలో అభ్యర్థి ఎవరనేది చూడటం లేదు, ఒక్క జగన్మోహన్రెడ్డినే చూసి ఓట్లేస్తారని అన్నారు. నియోజకవర్గంలోని చుండూరు మండలంలోని వైకాపా నాయకుల మధ్య అభిప్రాయ బేధాలున్నాయన్నది అవాస్తవమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..