ఇంటి వద్ద పింఛను ఇవ్వకపోవడం వైకాపా కుట్రే
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇవ్వకపోవడం వైకాపా కుట్రేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఖజానా ఖాళీ చేసి తెదేపాపై దుష్ప్రచారం విమర్శలను తిప్పికొట్టండి
నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇవ్వకపోవడం వైకాపా కుట్రేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. అవ్వా తాత అంటూనే సీఎం జగన్ వారిని మోసగించారని దుయ్యబట్టారు. పింఛన్ల పంపిణీపై వైకాపా అబద్ధాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక రూ.13 వేల కోట్ల నిధుల్ని అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. నేడు పింఛన్లు ఇవ్వడానికి నగదు లేక ఆ నెపాన్ని తెదేపా, ఎన్నికల సంఘంపై నెడుతున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలు, బూత్స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెదేపా ఎవరినీ అలా కోరలేదు
‘క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పి కొట్టండి. తెదేపా ప్రభుత్వం వచ్చాక రూ.4 వేలు పింఛను ఇస్తుందని.. రెండు, మూడు నెలలు తీసుకోకపోయినా ఒకేసారి చెల్లిస్తామనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయండి. వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయనివ్వకూడదని ఈసీతో సహా ఎవరినీ తెదేపా కోరలేదు. వారిని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ వాడుకోబట్టే ఈసీ వారిని సంక్షేమ పథకాల అమలు నుంచి దూరం పెట్టింది. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులోనే ఇంటింటికీ పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వమే కావాలని ఇవ్వడం లేదు. తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వృద్ధులు, దివ్యాంగుల్ని వేధించాలని జగన్ చూస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి ఇంటి వద్దే పింఛన్ ఇవ్వాలి. జిల్లా స్థాయి నేతలు కలెక్టర్లను, మండల స్థాయి నేతలు తహసీల్దార్లను కలిసి పింఛన్ల పంపిణీపై వినతిపత్రాలు ఇవ్వండి’ అని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రానికి నేనే డ్రైవర్గా ఉంటా
‘ప్రజాగళం సభలకు వస్తున్న స్పందన.. కూటమి గెలుపునకు సూచిక. జగన్ను ఇంటికి పంపాలనే బలమైన భావన, కసి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ రూ.పది ఇచ్చి రూ.వంద దోచేస్తున్న అంశాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలి. వైకాపా వాళ్లు తప్పుడు పోస్టులు పెడుతూ ముఖ్యంగా ముస్లింలలో అభద్రతా భావం పెంచుతున్నారు. గతంలో మనం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్నా ఏనాడూ వారికి ఇబ్బంది కలగనీయలేదు. పొత్తుపై దుష్ప్రచారం చేస్తున్న వైకాపా వాళ్లు.. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ బేషరతుగా మద్దతిచ్చారు. శింగనమలలో బినామీగా ఉన్న డ్రైవర్కు సీటు ఇచ్చారని నేను అంటే ఆ వృత్తిని అవమానపరిచినట్టు ప్రచారం చేశారు. రాష్ట్రానికి నేనే డ్రైవర్గా ఉండి గమ్యానికి చేరుస్తా. 3వ తేది(బుధవారం) నుంచి మళ్లీ ప్రజాగళం సభలు ప్రారంభిస్తా’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి