షర్మిలను గెలిపిస్తేనే వైఎస్‌ వివేకాకు న్యాయం

ఏపీలోని కడప లోక్‌సభ స్థానానికి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేయనుండటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు.

Published : 03 Apr 2024 03:24 IST

కడపలో వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వొద్దు: సీపీఐ నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలోని కడప లోక్‌సభ స్థానానికి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేయనుండటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. కడప లోక్‌సభ స్థానంలో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని, హత్యకు గురైన దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డికి న్యాయం జరగాలంటే కడపలో షర్మిలను గెలిపించాలని కోరారు. ఈ మేరకు నారాయణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని