వారసత్వ బరి!
కన్నడనాట లోక్సభ ఎన్నికల్లో వారసులు భారీగా టికెట్లు దక్కించుకున్నారు. మొత్తం 28 పార్లమెంటు నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో 14 స్థానాలకు ఈ నెల 26న, మిగిలిన వాటికి మే 7న పోలింగ్ జరగనుంది.
కర్ణాటకలో రాజకీయ కుటుంబాల నుంచి ఈసారి 16 మందికి టికెట్లు
ఈనాడు, బెంగళూరు: కన్నడనాట లోక్సభ ఎన్నికల్లో వారసులు భారీగా టికెట్లు దక్కించుకున్నారు. మొత్తం 28 పార్లమెంటు నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో 14 స్థానాలకు ఈ నెల 26న, మిగిలిన వాటికి మే 7న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని స్థానాలకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. భాజపా, జేడీఎస్ కలిసి కూటమిగా, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. భాజపా 25 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, జేడీఎస్ మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ మొత్తం 28 చోట్లా పోటీపడుతోంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో రాజకీయ కుటుంబాలకు చెందిన అభ్యర్థులు బరిలో దిగి పోటీని ఆసక్తిగా మార్చారు. రాష్ట్రంలో గతంలో ఏ లోక్సభ ఎన్నికల్లోనూ లేనంతగా 16 మంది వారసులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.
దేవెగౌడ హవా
రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ కుటుంబంగా పరిగణించే మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ ఇంటి నుంచి ముగ్గురు సభ్యులు బరిలో దిగారు. లోక్సభ, విధానసభ, స్థానిక ఎన్నికలేవైనా ఈ కుటుంబం నుంచి కనీసం ఇద్దరు పోటీలో ఉండాల్సిందే. ఇదే క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఆయన రెండో కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మండ్య నుంచి జేడీఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హాసన నుంచి పోటీపడుతున్నారు. ప్రజ్వల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దేవెగౌడ పెద్దల్లుడు, ప్రముఖ హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ సి.ఎన్.మంజునాథ్ భాజపా తరఫున బెంగళూరు గ్రామీణ నుంచి పోటీ చేస్తున్నారు.
మరో ప్రముఖ రాజకీయ నేత బి.ఎస్.యడియూరప్ప కుటుంబ నుంచి ఆయన పెద్ద కుమారుడు బి.వై.రాఘవేంద్ర శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. మరో కీలక నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పెద్దల్లుడు డాక్టర్ రాధాకృష్ణ దొడ్డమని కలబురగిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఖర్గే పోటీ చేసి రాజకీయ ప్రయాణంలో తొలి ఓటమిని చవిచూశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ బెంగళూరు గ్రామీణ నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్కున్న ఏకైక సిట్టింగ్ ఎంపీ. మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు.
మరికొందరు..
ప్రముఖ నేతలే కాకుండా మరికొందరు నాయకుల కుటుంబాల సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పెద్ద వయసున్న ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప (95) కోడలు ప్రభా మల్లికార్జున కాంగ్రెస్ అభ్యర్థిగా దావణగెరె నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడే సిట్టింగ్ ఎంపీ జి.ఎం.సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వర భాజపా తరపున బరిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రహమాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ అలీఖాన్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారి కుటుంబ సభ్యులు ఆరుగురు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి కనీసం రెండు పదుల స్థానాల్లో గెలవాలని మంత్రులనే బరిలో దింపాలని ప్రయత్నించింది. వారు పోటీకి నిరాకరించి తమ వారసులకు టికెట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఇలా రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి (బెంగళూరు దక్షిణ), అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే కుమారుడు సాగర్ ఖండ్రే (బీదర్), ప్రజాపనుల మంత్రి సతీశ్ జార్ఖిహొళి కుమార్తె ప్రియాంకా జార్ఖిహొళి (చిక్కోడి), మహిళా, శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ (బెళగావి), సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప కుమారుడు సుభాష్ బోస్ (చామరాజనగర), సహకారశాఖ మంత్రి శివానంద పాటిల్ కుమార్తె సంయుక్తా పాటిల్ (బాగల్కోటె) పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!