37 స్థానాలు భాజపాకు సవాలే
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది.
అందులో 13 యూపీలోనే..
వీటిని నిలబెట్టుకుంటేనే 370 లక్ష్యం సాధ్యం
ఈనాడు, దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది. 73 స్థానాల్లో లక్ష లోపు మెజారిటీ వచ్చింది. అందులోనూ 36 స్థానాల్లో 50వేల నుంచి 97వేల వరకు, మిగిలిన 37 స్థానాల్లో 50వేలలోపు మెజారిటీ మాత్రమే దక్కింది. ఇందులో 10 ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. మిగిలినవి జనరల్ స్థానాలు. ఇక్కడ ఏ మాత్రం తప్పటడుగు వేసినా నష్టపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో భాజపా నాయకత్వం ఈ స్థానాలపై ఎక్కువగా గురిపెట్టింది. ఉత్తర భారత దేశంలో ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో సీట్లు దక్కించుకున్న ఆ పార్టీకి కొత్తగా వచ్చే స్థానాలేవీ పెద్దగా కనిపించడం లేదు. 370 స్థానాలను గెలుచుకోవాలంటే ఇప్పుడున్న వాటిని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త వాటిని చేజిక్కించుకోవాలి. అందుకే పార్టీ నాయకత్వం గత ఎన్నికల్లో లక్షలోపు మెజారిటీ సాధించిన స్థానాలపై సూక్ష్మంగా గురిపెట్టి అభ్యర్థులను మార్చే పనిలో పడింది. 2019లో వీచిన నరేంద్ర మోదీ గాలితో దేశవ్యాప్తంగా భాజపా అభ్యర్థులు లక్షల మెజారిటీతో విజయ దుంధుబి మోగించిన సమయంలోనూ ఈ అభ్యర్థులు అత్తెసరు మెజారిటీతో బయటపడిన నేపథ్యంలో ఈసారి ఎంపికలో పార్టీ ఆచితూచి వ్యవహరించింది.
50వేల నుంచి లక్ష వరకు మెజారిటీతో గెలిచిన 36 మంది సిట్టింగ్ ఎంపీల్లో 13 మందిని మార్చింది. 50వేలలోపు మెజారిటీతో గట్టెక్కిన 37 మంది సిట్టింగ్ ఎంపీల్లో మరో 13 మందిని మార్చింది. అంటే లక్షలోపు మెజారిటీతో గట్టెక్కిన 73 మందిలో 35% మందిని పార్టీ పక్కనబెట్టింది. ఇందులో ఇంకా 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 50వేలలోపు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల్లో దక్షిణాదిలోని కొప్పళ, చామరాజనగర, తుమకూరు మినహా మిగిలినవన్నీ ఉత్తర భారత దేశానికి చెందిన స్థానాలే. ఇందులో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 13 స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ యూపీలో 42.63% ఓట్లతో 71 స్థానాలు గెలుచుకుంది. 2019 నాటికి ఓట్లు 49.97%కి పెరిగినా సీట్లు 62కి పడిపోయాయి. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమిగా పోటీ చేయడంవల్ల భాజపా సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండటంవల్ల యూపీలో భాజపా గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యంతోనే హింసాకాండ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జోక్యం వల్లే పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
విశాఖలో జరిగింది చిన్న సంఘటనే
జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు. -
తెదేపాకు ఓటేయాలన్నందుకు.. దంపతులపై దాడి
తెదేపాకు ఓటేయాలని చెప్పినందుకు కర్నూలు జిల్లా కోడుమూరు ఇంద్రజిత్గుప్తా నగర్కు చెందిన దంపతులపై గురువారం రాత్రి దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..