37 స్థానాలు భాజపాకు సవాలే
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది.
అందులో 13 యూపీలోనే..
వీటిని నిలబెట్టుకుంటేనే 370 లక్ష్యం సాధ్యం
ఈనాడు, దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది. 73 స్థానాల్లో లక్ష లోపు మెజారిటీ వచ్చింది. అందులోనూ 36 స్థానాల్లో 50వేల నుంచి 97వేల వరకు, మిగిలిన 37 స్థానాల్లో 50వేలలోపు మెజారిటీ మాత్రమే దక్కింది. ఇందులో 10 ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. మిగిలినవి జనరల్ స్థానాలు. ఇక్కడ ఏ మాత్రం తప్పటడుగు వేసినా నష్టపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో భాజపా నాయకత్వం ఈ స్థానాలపై ఎక్కువగా గురిపెట్టింది. ఉత్తర భారత దేశంలో ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో సీట్లు దక్కించుకున్న ఆ పార్టీకి కొత్తగా వచ్చే స్థానాలేవీ పెద్దగా కనిపించడం లేదు. 370 స్థానాలను గెలుచుకోవాలంటే ఇప్పుడున్న వాటిని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త వాటిని చేజిక్కించుకోవాలి. అందుకే పార్టీ నాయకత్వం గత ఎన్నికల్లో లక్షలోపు మెజారిటీ సాధించిన స్థానాలపై సూక్ష్మంగా గురిపెట్టి అభ్యర్థులను మార్చే పనిలో పడింది. 2019లో వీచిన నరేంద్ర మోదీ గాలితో దేశవ్యాప్తంగా భాజపా అభ్యర్థులు లక్షల మెజారిటీతో విజయ దుంధుబి మోగించిన సమయంలోనూ ఈ అభ్యర్థులు అత్తెసరు మెజారిటీతో బయటపడిన నేపథ్యంలో ఈసారి ఎంపికలో పార్టీ ఆచితూచి వ్యవహరించింది.
50వేల నుంచి లక్ష వరకు మెజారిటీతో గెలిచిన 36 మంది సిట్టింగ్ ఎంపీల్లో 13 మందిని మార్చింది. 50వేలలోపు మెజారిటీతో గట్టెక్కిన 37 మంది సిట్టింగ్ ఎంపీల్లో మరో 13 మందిని మార్చింది. అంటే లక్షలోపు మెజారిటీతో గట్టెక్కిన 73 మందిలో 35% మందిని పార్టీ పక్కనబెట్టింది. ఇందులో ఇంకా 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 50వేలలోపు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల్లో దక్షిణాదిలోని కొప్పళ, చామరాజనగర, తుమకూరు మినహా మిగిలినవన్నీ ఉత్తర భారత దేశానికి చెందిన స్థానాలే. ఇందులో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 13 స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ యూపీలో 42.63% ఓట్లతో 71 స్థానాలు గెలుచుకుంది. 2019 నాటికి ఓట్లు 49.97%కి పెరిగినా సీట్లు 62కి పడిపోయాయి. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమిగా పోటీ చేయడంవల్ల భాజపా సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండటంవల్ల యూపీలో భాజపా గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?