కంచు కోటలు లేవిక్కడ!
ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకింత కంగారుగా ఉంటుంది. విజయం పార్టీల మధ్య, కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది.
తమిళనాట లోక్సభ స్థానాల్లో వరుసగా గెలవని పార్టీలు
ప్రతిసారీ విలక్షణ తీర్పునిస్తున్న ఓటర్లు
ఈనాడు, చెన్నై: ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకింత కంగారుగా ఉంటుంది. విజయం పార్టీల మధ్య, కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఈసారి తొలి విడతలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో కూటమి పార్టీలన్నీ జాగ్రత్తగా అభ్యర్థుల్ని ఎంపిక చేశాయి. ప్రచార రంగంలోకి దిగాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి, అభ్యర్థికి కంచుకోటలు లేకపోవడం ఇక్కడి వైచిత్రి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక స్థానం నుంచి వరుసగా 3 సార్లు ఒకే పార్టీ గెలిచిన చరిత్ర తమిళనాడులో లేదు. రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలున్నాయి. విభజన తర్వాత జరిగిన 2009, 2014, 2019 ఎన్నికల్ని చూస్తే.. వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు ఏకంగా 27 ఉన్నాయి. ప్రధానంగా ఈ విజయాలు 11 నియోజకవర్గాల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడుతుండగా, మిగిలిన 16 చోట్ల డీఎంకే కూటమి పార్టీలు, అన్నాడీఎంకే మధ్య మారుతూ వస్తున్నాయి.
చీలికలతో అన్నాడీఎంకేకు చేటు
తమిళనాడులో అన్నాడీఎంకేకు మంచి ఓటు బ్యాంకు ఉంది. విజయం దోబూచులాడే ఈ మొత్తం 27 నియోజకవర్గాల్లో 26 చోట్ల 2014లో అన్నాడీఎంకే క్లీన్స్వీప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. 2016లో జయలలిత మరణానంతరం పార్టీ బలహీనపడుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. అన్నాడీఎంకేతో పాటు కూటమి పార్టీలు ఈ స్థానాల్లో ఒక్క సీటునూ సాధించలేకపోయాయి. ఇప్పుడు అదే అన్నాడీఎంకే పార్టీలో చీలికలొచ్చాయి. ముఖ్యమంత్రిగా చేసిన ఒ.పన్నీరు సెల్వంను పార్టీ బహిష్కరించగా, టీటీవీ దినకరన్ స్వయంగా ఏఎంఎంకే పార్టీ పెట్టారు. ఇప్పుడు వీరిరువురూ భాజపాతో జతకట్టారు. ఒక బలమైన పార్టీ రెండుగా చీలిపోవడం ఈసారి ఎన్నికల్లో డీఎంకేకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఫలితాలను చూసుకుంటే..
- 2009 లోక్సభ ఎన్నికల్లో యూపీఏలో ఉన్న డీఎంకే కూటమికి జనం 27 ఎంపీ స్థానాల్ని కట్టబెట్టారు. మూడో ఫ్రంట్గా బరిలోకి దిగిన అన్నాడీఎంకే కూటమికి 12 స్థానాల్ని ఇచ్చారు. ఈ ఎన్నికలు జరిగే సమయానికి భాజపా పోటీలోనే లేదు. కమ్యూనిస్టు పార్టీలూ అప్పటి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత వెంటే ఉండి పోటీకి దిగాయి. వైగో పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే), రాందాస్ స్థాపించిన పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) జయలలితకు అండగా నిలిచాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, విడుదలై మక్కల్ కట్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఉన్నాయి.
- జయలలిత కూటమికి 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్కటే విడిగా పోటీ చేసింది. 39 స్థానాల్లో 37 చోట్ల రెండాకుల జెండా రెపరెపలాడింది. ఎన్డీయే కూటమిగా బరిలో దిగిన భాజపాకు సినీ నటుడు విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అండగా నిలిచింది. పీఎంకే, ఎండీఎంకే వెంటరాగా.. భాజపాతో కలిసి ఇందియ జననాయగ కట్చి (ఐజేకే), కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (కేఎండీకే), పుదియ నీది కట్చి (పీఎన్కే) పార్టీలు కమలం గుర్తు మీద బరిలోకి దిగాయి. డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిగా డీఎంకే, వీసీకే, ఐయూఎంఎల్, ఎంఎంకే, పుదియ తమిళగం (పీటీ) బరిలోకి దిగగా.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. వామపక్ష పార్టీలు వేరుగా బరిలోకి దిగాయి. ఎన్డీయే కూటమికి 2 స్థానాలే దక్కగా.. డీఎంకే కూటమికి, కాంగ్రెస్కు ఒక్క సీటూ రాలేదు.
- 2019 ఎన్నికలొచ్చేసరికి పార్టీల, కూటముల వైఖరులు మారాయనే చెప్పాలి. డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణాల నేపథ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ వెంట కాంగ్రెస్, వామపక్షాలు నిలిచాయి. వీరు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిగా ఏర్పడి.. అప్పటిదాకా ఎన్డీయేలో ఉన్న ఎండీఎంకే, కేఎండీకే, ఐజేకేలను తమతో కలుపుకొన్నారు. మరోపక్క అన్నాడీఎంకే వెంట తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలోని భాజపాతోపాటు పీఎంకే, డీఎండీకే, పీఎన్కే, పీటీ పార్టీలు, అలాగే తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ మూపనార్) నడిచొచ్చాయి. జయలలిత మరణం తర్వాత టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగమ్ (ఏఎంఎంకే), సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) మరో ఫ్రంట్గా బరిలోకి రాగా, సినీ నటులు కమల్ హాసన్ తెచ్చిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం), సీమాన్ తెచ్చిన నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలు వేరుగా బరిలో దిగాయి. కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత జరిగిన ఈ కీలక ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయభేరి మోగించింది. ఏకంగా 38 స్థానాల్లో జెండా ఎగరేయగా, కేవలం ఒక్క స్థానంలో అన్నాడీఎంకే గెలిచింది.
- యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిగా బరిలో ఉంది. గత ఎన్నికల్లో బరిలో ఉన్న పార్టీలే దాదాపు కూటమిలో ఉన్నాయి. ఇందులో ఉన్న ఐజేకే ఈసారి భాజపాతో చేతులు కలిపింది. ఎన్డీయేలో పీఎంకే, టీఎంసీ (ఎం), ఏఎంఎంకే పార్టీలు తమ గుర్తులతో పోటీ చేస్తుండగా, పీఎన్కే, ఐజేకే, ఇందియ మక్కల్ కల్వి మున్నేట్ర కళగం, తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాయి.
వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు
ఉత్తర చెన్నై, మధ్య చెన్నై, కాంచీపురం (ఎస్సీ), అరక్కోణం, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురం, తిరువణ్ణామలై, ఆరణి, కళ్లకురిచ్చి, నామక్కల్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుక్కల్, పెరంబలూరు, కడలూరు, చిదంబరం (ఎస్సీ), నాగపట్టిణం (ఎస్సీ), తంజావూరు, శివగంగై, మదురై, విరుదు నగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యా కుమారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM