కంచు కోటలు లేవిక్కడ!
ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకింత కంగారుగా ఉంటుంది. విజయం పార్టీల మధ్య, కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది.
తమిళనాట లోక్సభ స్థానాల్లో వరుసగా గెలవని పార్టీలు
ప్రతిసారీ విలక్షణ తీర్పునిస్తున్న ఓటర్లు
ఈనాడు, చెన్నై: ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకింత కంగారుగా ఉంటుంది. విజయం పార్టీల మధ్య, కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఈసారి తొలి విడతలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో కూటమి పార్టీలన్నీ జాగ్రత్తగా అభ్యర్థుల్ని ఎంపిక చేశాయి. ప్రచార రంగంలోకి దిగాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి, అభ్యర్థికి కంచుకోటలు లేకపోవడం ఇక్కడి వైచిత్రి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక స్థానం నుంచి వరుసగా 3 సార్లు ఒకే పార్టీ గెలిచిన చరిత్ర తమిళనాడులో లేదు. రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలున్నాయి. విభజన తర్వాత జరిగిన 2009, 2014, 2019 ఎన్నికల్ని చూస్తే.. వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు ఏకంగా 27 ఉన్నాయి. ప్రధానంగా ఈ విజయాలు 11 నియోజకవర్గాల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడుతుండగా, మిగిలిన 16 చోట్ల డీఎంకే కూటమి పార్టీలు, అన్నాడీఎంకే మధ్య మారుతూ వస్తున్నాయి.
చీలికలతో అన్నాడీఎంకేకు చేటు
తమిళనాడులో అన్నాడీఎంకేకు మంచి ఓటు బ్యాంకు ఉంది. విజయం దోబూచులాడే ఈ మొత్తం 27 నియోజకవర్గాల్లో 26 చోట్ల 2014లో అన్నాడీఎంకే క్లీన్స్వీప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. 2016లో జయలలిత మరణానంతరం పార్టీ బలహీనపడుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. అన్నాడీఎంకేతో పాటు కూటమి పార్టీలు ఈ స్థానాల్లో ఒక్క సీటునూ సాధించలేకపోయాయి. ఇప్పుడు అదే అన్నాడీఎంకే పార్టీలో చీలికలొచ్చాయి. ముఖ్యమంత్రిగా చేసిన ఒ.పన్నీరు సెల్వంను పార్టీ బహిష్కరించగా, టీటీవీ దినకరన్ స్వయంగా ఏఎంఎంకే పార్టీ పెట్టారు. ఇప్పుడు వీరిరువురూ భాజపాతో జతకట్టారు. ఒక బలమైన పార్టీ రెండుగా చీలిపోవడం ఈసారి ఎన్నికల్లో డీఎంకేకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఫలితాలను చూసుకుంటే..
- 2009 లోక్సభ ఎన్నికల్లో యూపీఏలో ఉన్న డీఎంకే కూటమికి జనం 27 ఎంపీ స్థానాల్ని కట్టబెట్టారు. మూడో ఫ్రంట్గా బరిలోకి దిగిన అన్నాడీఎంకే కూటమికి 12 స్థానాల్ని ఇచ్చారు. ఈ ఎన్నికలు జరిగే సమయానికి భాజపా పోటీలోనే లేదు. కమ్యూనిస్టు పార్టీలూ అప్పటి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత వెంటే ఉండి పోటీకి దిగాయి. వైగో పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే), రాందాస్ స్థాపించిన పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) జయలలితకు అండగా నిలిచాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, విడుదలై మక్కల్ కట్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఉన్నాయి.
- జయలలిత కూటమికి 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్కటే విడిగా పోటీ చేసింది. 39 స్థానాల్లో 37 చోట్ల రెండాకుల జెండా రెపరెపలాడింది. ఎన్డీయే కూటమిగా బరిలో దిగిన భాజపాకు సినీ నటుడు విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అండగా నిలిచింది. పీఎంకే, ఎండీఎంకే వెంటరాగా.. భాజపాతో కలిసి ఇందియ జననాయగ కట్చి (ఐజేకే), కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (కేఎండీకే), పుదియ నీది కట్చి (పీఎన్కే) పార్టీలు కమలం గుర్తు మీద బరిలోకి దిగాయి. డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిగా డీఎంకే, వీసీకే, ఐయూఎంఎల్, ఎంఎంకే, పుదియ తమిళగం (పీటీ) బరిలోకి దిగగా.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. వామపక్ష పార్టీలు వేరుగా బరిలోకి దిగాయి. ఎన్డీయే కూటమికి 2 స్థానాలే దక్కగా.. డీఎంకే కూటమికి, కాంగ్రెస్కు ఒక్క సీటూ రాలేదు.
- 2019 ఎన్నికలొచ్చేసరికి పార్టీల, కూటముల వైఖరులు మారాయనే చెప్పాలి. డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణాల నేపథ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ వెంట కాంగ్రెస్, వామపక్షాలు నిలిచాయి. వీరు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిగా ఏర్పడి.. అప్పటిదాకా ఎన్డీయేలో ఉన్న ఎండీఎంకే, కేఎండీకే, ఐజేకేలను తమతో కలుపుకొన్నారు. మరోపక్క అన్నాడీఎంకే వెంట తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలోని భాజపాతోపాటు పీఎంకే, డీఎండీకే, పీఎన్కే, పీటీ పార్టీలు, అలాగే తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ మూపనార్) నడిచొచ్చాయి. జయలలిత మరణం తర్వాత టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగమ్ (ఏఎంఎంకే), సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) మరో ఫ్రంట్గా బరిలోకి రాగా, సినీ నటులు కమల్ హాసన్ తెచ్చిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం), సీమాన్ తెచ్చిన నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలు వేరుగా బరిలో దిగాయి. కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత జరిగిన ఈ కీలక ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయభేరి మోగించింది. ఏకంగా 38 స్థానాల్లో జెండా ఎగరేయగా, కేవలం ఒక్క స్థానంలో అన్నాడీఎంకే గెలిచింది.
- యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిగా బరిలో ఉంది. గత ఎన్నికల్లో బరిలో ఉన్న పార్టీలే దాదాపు కూటమిలో ఉన్నాయి. ఇందులో ఉన్న ఐజేకే ఈసారి భాజపాతో చేతులు కలిపింది. ఎన్డీయేలో పీఎంకే, టీఎంసీ (ఎం), ఏఎంఎంకే పార్టీలు తమ గుర్తులతో పోటీ చేస్తుండగా, పీఎన్కే, ఐజేకే, ఇందియ మక్కల్ కల్వి మున్నేట్ర కళగం, తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాయి.
వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు
ఉత్తర చెన్నై, మధ్య చెన్నై, కాంచీపురం (ఎస్సీ), అరక్కోణం, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురం, తిరువణ్ణామలై, ఆరణి, కళ్లకురిచ్చి, నామక్కల్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుక్కల్, పెరంబలూరు, కడలూరు, చిదంబరం (ఎస్సీ), నాగపట్టిణం (ఎస్సీ), తంజావూరు, శివగంగై, మదురై, విరుదు నగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యా కుమారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం