కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా, భారాస కుట్ర
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్పై కొంతమంది కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
కొడంగల్, కోస్గి, న్యూస్టుడే: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. కొంతమంది కక్షగట్టి కాంగ్రెస్ను పడేయాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే.. కేంద్రం నుంచి అధిక నిధులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. మట్టి పని, బొగ్గు పని కోసం ఈ ప్రాంత ప్రజలు ముంబయి, పుణెలకు వలస వెళ్తోంటే వాటిని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ నివారించలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అయినా ఒక్క ఎకరానికీ సాగునీరు అందించలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు చెన్నారెడ్డి తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో చీమలు, పాముల్లా చొరబడిన కొందరు.. తెలంగాణను పట్టిపీడించారని ఆరోపించారు. భారాస నేతలను గత ఎన్నికల్లో ప్రజలు చీదరించుకున్నా.. మరోమారు వారి ముందుకురావడం సిగ్గుచేటన్నారు. మహబూబ్నగర్కు ఏం చేశారని కేటీఆర్ పర్యటిస్తారని ప్రశ్నించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత పూర్తి చేశారా అని ప్రశ్నించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో మహర్దశ
కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్, వెటర్నరీ, మహిళా డిగ్రీ కళాశాలలు తెచ్చుకున్నామని రేవంత్ తెలిపారు. రూ.వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చుకుంటున్నామని ఆయన వివరించారు. కరవుతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో మహర్దశ రానుందని చెప్పారు. నాటి కాంగ్రెస్ హయాంలో డి.కె.అరుణ అనేక పదవులు చేపట్టారని.. కార్యకర్తలను మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్లారన్నారు. పాలమూరు జిల్లాకు ఆమె చేసిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి కొడంగల్లో 50 వేల మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సంపత్, పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కాన్వాయ్లోని కారు టైరు పంక్చర్
పూడూరు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి కొడంగల్కు వెళ్తుండగా మన్నెగూడ బైపాస్ వద్దకు రాగానే కాన్వాయ్కు చెందిన ఓ కారు టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. ఆ కారులో సీఎం లేరు. కాన్వాయ్లోని మిగతా కార్లు యథావిధిగా ముందుకు వెళ్లాయి. పంక్చర్ అయిన కారు టైరును సిబ్బంది మార్చి కొడంగల్కు వెళ్లారు. టైర్ పంక్చర్ కావటంతోనే కారు ఆగిందని, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఎస్సై మధుసూద]న్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్