కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా, భారాస కుట్ర
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్పై కొంతమంది కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
కొడంగల్, కోస్గి, న్యూస్టుడే: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. కొంతమంది కక్షగట్టి కాంగ్రెస్ను పడేయాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే.. కేంద్రం నుంచి అధిక నిధులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. మట్టి పని, బొగ్గు పని కోసం ఈ ప్రాంత ప్రజలు ముంబయి, పుణెలకు వలస వెళ్తోంటే వాటిని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ నివారించలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అయినా ఒక్క ఎకరానికీ సాగునీరు అందించలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు చెన్నారెడ్డి తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో చీమలు, పాముల్లా చొరబడిన కొందరు.. తెలంగాణను పట్టిపీడించారని ఆరోపించారు. భారాస నేతలను గత ఎన్నికల్లో ప్రజలు చీదరించుకున్నా.. మరోమారు వారి ముందుకురావడం సిగ్గుచేటన్నారు. మహబూబ్నగర్కు ఏం చేశారని కేటీఆర్ పర్యటిస్తారని ప్రశ్నించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత పూర్తి చేశారా అని ప్రశ్నించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో మహర్దశ
కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్, వెటర్నరీ, మహిళా డిగ్రీ కళాశాలలు తెచ్చుకున్నామని రేవంత్ తెలిపారు. రూ.వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చుకుంటున్నామని ఆయన వివరించారు. కరవుతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో మహర్దశ రానుందని చెప్పారు. నాటి కాంగ్రెస్ హయాంలో డి.కె.అరుణ అనేక పదవులు చేపట్టారని.. కార్యకర్తలను మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్లారన్నారు. పాలమూరు జిల్లాకు ఆమె చేసిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి కొడంగల్లో 50 వేల మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సంపత్, పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కాన్వాయ్లోని కారు టైరు పంక్చర్
పూడూరు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి కొడంగల్కు వెళ్తుండగా మన్నెగూడ బైపాస్ వద్దకు రాగానే కాన్వాయ్కు చెందిన ఓ కారు టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. ఆ కారులో సీఎం లేరు. కాన్వాయ్లోని మిగతా కార్లు యథావిధిగా ముందుకు వెళ్లాయి. పంక్చర్ అయిన కారు టైరును సిబ్బంది మార్చి కొడంగల్కు వెళ్లారు. టైర్ పంక్చర్ కావటంతోనే కారు ఆగిందని, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఎస్సై మధుసూద]న్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన