నన్ను భయపెట్టాలని చూస్తున్నారు
అవినీతిని కాపాడేందుకు పనిచేస్తున్న ‘ఇండియా’ కూటమి నేతలు దేశ ప్రగతి నిలిచిపోయేలా తనను దుర్భాషలాడి, బెదిరించాలని చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఇండియా కూటమిపై మోదీ ధ్వజం
విపక్ష నేతల నోట ‘పాకిస్థాన్’ భాష
భోపాల్, పీలీభీత్: అవినీతిని కాపాడేందుకు పనిచేస్తున్న ‘ఇండియా’ కూటమి నేతలు దేశ ప్రగతి నిలిచిపోయేలా తనను దుర్భాషలాడి, బెదిరించాలని చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాను మహాకాల్ భగవానుడి భక్తుడినని, ఎవరికీ భయపడబోనని చెప్పారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో మంగళవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రాబోయే లోక్సభ ఎన్నికలు నవభారత నిర్మాణమనే యజ్ఞానికి ఓ సంకల్పం లాంటివని, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్డీయే తన మూడోవిడత పాలనలో భారీ, చారిత్రక నిర్ణయాలు తీసుకొంటుందన్నారు. కాషాయ సముద్రంలా తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే జూన్ 4 నాటి పోలింగు ఫలితాలు ఇప్పుడే తెలిసిపోతున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు వంటి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను తాను పూర్తిచేసినపుడు విపక్షాలు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.
ఉత్తర్ప్రదేశ్లోని పీలీభీత్లో మంగళవారం ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పీలీభీత్లో నివసిస్తున్న అటువంటి కుటుంబాలు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1984లో సిక్కు సోదరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని ఎవరూ మరచిపోలేరన్నారు. సెలవులు గడిపేందుకు విదేశాలకు వెళ్లే కాంగ్రెస్, ఎస్పీ నేతలకు దేశాన్ని సమైక్యపరచిన నర్మదా తీరంలోని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించేందుకు కూడా సమయం లేదా అని ప్రశ్నించారు. చివరకు దేశమంతా ఆరాధించే ‘శక్తి’ స్వరూపాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రపంచ దేశాల నుంచి ఎన్నోసార్లు సాయం కోరారని, కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్ ఇపుడు ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు.
చెన్నైలో అట్టహాసంగా రోడ్షో
ఈనాడు, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం చెన్నై టీనగర్ పాండీబజారులో రోడ్షో నిర్వహించారు. తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ప్రధాని కమలం చిహ్నాన్ని ప్రదర్శిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు 2 కి.మీ.ల మేర దారికి ఇరువైపులా కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. ఓపెన్టాప్ వాహనంపై మోదీ వెంట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైతోపాటు దక్షిణ చెన్నై అభ్యర్థిని తమిళి సై సౌందరరాజన్, మధ్య చెన్నై అభ్యర్థి వినోజ్ పి.సెల్వం, ఉత్తర చెన్నై అభ్యర్థి ఆర్.సి.పాల్ కనగరాజ్ తదితరులు ఉన్నారు. రాత్రికి చెన్నైలో బస చేస్తున్న ప్రధాని బుధవారం వేలూరు, కోయంబత్తూరులోని మేట్టుపాళయం వెళతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే