అభ్యర్థి పేరే.. తొలి ప్రత్యర్థి!
ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన స్వతంత్రులు బరిలో ఉంటే ఏమవుతుందో.. తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నిక పెద్ద గుణపాఠం నేర్పింది.
అవే పేర్లతో స్వతంత్రుల పోటీ
తమిళనాడులో పలు లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి..
ఈనాడు, చెన్నై: ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన స్వతంత్రులు బరిలో ఉంటే ఏమవుతుందో.. తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నిక పెద్ద గుణపాఠం నేర్పింది. విడుదలై మక్కల్ కట్చి(వీసీకే) వ్యవస్థాపకుడు తోల్ తిరుమావళవన్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 87 ఓట్లతో పరాజయం పాలయ్యారు. అప్పట్లో ఆయన కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ స్థానానికి పోటీ చేశారు. బ్యాలెట్పై అదే పేరుతో ఉన్న టి.తిరుమావళవన్ అనే స్వతంత్ర అభ్యర్థికి 289 ఓట్లు పోలయ్యాయి. ఇదే ఆ స్థానం విజేతను నిర్ణయించింది. విజయం తారుమారైంది.
ప్రధాన పార్టీల్లో ఆందోళన..
తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు తొలి విడతలోనే జరుగుతున్నాయి. దాదాపు అన్నిచోట్లా ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య పోరు నడుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్రుల నుంచి విచిత్రమైన చిక్కు వచ్చి పడుతోంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ తరహా సవాలు ప్రధాన పార్టీలకు పలు లోక్సభ స్థానాల్లో ఎదురవుతోంది.
ఓట్లు చీల్చాలని..
వాస్తవానికి స్వతంత్రులకు ఓట్లు పెద్దగా రావు. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చడంలో కీలకంగా ఉంటారు. ఓడించేందుకు, తమ ఓటు బ్యాంకును దెబ్బ తీసేందుకు ప్రత్యర్థి పార్టీలు ఈ రకమైన కుట్రను పన్నుతున్నాయని పలు నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోటీలో ఉన్న స్వతంత్రులు కార్మికులు, గృహిణులు, పెద్దగా ఆస్తుల్లేని వారే ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే కూటముల అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఒకే పేరుతో ఉన్న స్వతంత్రుల్ని దింపినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు తమ పేర్లతో ఉన్నవారు 18 పార్లమెంటు స్థానాల్లో పోటీ పడుతుండగా, ఇండియా కూటమి అభ్యర్థుల పేర్లతో 14 స్థానాల్లో ఈ పరీక్ష కొనసాగుతోంది. ఎన్డీయే కూటమికి 6 చోట్ల ఈ పరిస్థితి ఉంది. కనీసం ఒకరి నుంచి గరిష్ఠంగా ఐదుగురు అవే పేర్లున్న స్వతంత్రులు బరిలో ఉన్నారు.
ఎత్తుగడ వెనుక అసలు సంగతి ఇదీ..
ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. అంతకు మించితే మరొక ఈవీఎంకు అవకాశమిస్తారు. ఎక్కడైతే అదనపు ఈవీఎంలకు అవకాశమిస్తున్నారో.. ఆయా స్థానాల్లో ప్రధాన అభ్యర్థి పేరును పోలిన స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. మొదటి ఈవీఎంలో ప్రధాన అభ్యర్థుల పేర్లు పై వరుసలోనే రానున్నాయి. రెండో, మూడో ఈవీఎంలకు వచ్చేసరికి.. అదే పేరున్న స్వతంత్రులు పైకొచ్చే అవకాశముంది. ఫలితంగా ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 950 మంది బరిలో ఉండగా 29 నియోజకవర్గాల్లో అదనపు ఈవీఎంల అవసరం పడుతోంది.
బాధితులవుతారా..?
- పెరంబలూరు డీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కె.ఎన్.నెహ్రూ తనయుడు కె.ఎన్.అరుణ్ నెహ్రూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే నియోజవర్గంలో అరుణ్ నెహ్రూ, ఎన్.అరుణ్ నెహ్రూ, జె.అరుణ్ నెహ్రూ పేర్లతో మరో ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
- రామనాథపురంలో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న ఒ.పన్నీరుసెల్వం పరిస్థితి మరీ దారుణం. ఇంటిపేరు ‘ఒ’తో కలుపుకొని ఆయన పేరుతో నలుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఎం.పన్నీరు సెల్వం పేరుతో ఇంకొకరున్నారు. ఆరుగురు ఒకే పేరుతో పోటీ పడుతున్నారు.
- వేలూరులోనూ అంతే. భాజపా అభ్యర్థి ఎ.సి.షణ్ముగం పేరుతో ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి పశుపతి పేరుతోనే మరొకరున్నారు.
- అత్యంత కీలకంగా మారిన కోయంబత్తూరు ఎన్నికలో డీఎంకే అభ్యర్థి గణపతి పి.రాజ్కుమార్కు పోటీగా స్వతంత్రులు అదే పేర్లతో ఐదుగురున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి సింగై జి.రామచంద్రన్ పేరును పోలిన ఎం.రామచంద్రన్, ఆర్.రామచంద్రన్, ఎన్.రామచంద్రన్, రామచంద్రన్ పేర్లతో కొందరు పోటీపడుతున్నారు.
- కరూరు లోక్సభ స్థానానికి అత్యధికంగా 54 మంది బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి పేరుతో ఇంకో ఇద్దరు బరిలో ఉన్నారు. శివగంగై కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరానికి పోటీగా కార్తీ పేరుతో ఇద్దరున్నారు. తిరుచ్చిలో ఎండీఎంకే అభ్యర్థి, వైగో కుమారుడు దురై వైగోకు పోటీగా.. దురై పేరు వచ్చేలా ముగ్గురు బరిలో ఉన్నారు.
- ధర్మపురి స్థానంలో డీఎంకే అభ్యర్థి ఎ.మణి పేరుతో నలుగురు, అన్నాడీఎంకే అభ్యర్థి అశోకన్ పేరుపై ఒకరు, పీఎంకే అభ్యర్థిని సౌమ్యా అన్బుమణికి పోటీగా సౌమ్యా పేరుతో ఇంకొకరు బరిలో ఉన్నారు. తిరువణ్ణామలై సిట్టింగ్ ఎంపీ, డీఎంకే అభ్యర్థి సి.ఎన్.అన్నాదురై పేరుతో ముగ్గురున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా