అభ్యర్థి పేరే.. తొలి ప్రత్యర్థి!
ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన స్వతంత్రులు బరిలో ఉంటే ఏమవుతుందో.. తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నిక పెద్ద గుణపాఠం నేర్పింది.
అవే పేర్లతో స్వతంత్రుల పోటీ
తమిళనాడులో పలు లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి..
ఈనాడు, చెన్నై: ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన స్వతంత్రులు బరిలో ఉంటే ఏమవుతుందో.. తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నిక పెద్ద గుణపాఠం నేర్పింది. విడుదలై మక్కల్ కట్చి(వీసీకే) వ్యవస్థాపకుడు తోల్ తిరుమావళవన్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 87 ఓట్లతో పరాజయం పాలయ్యారు. అప్పట్లో ఆయన కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ స్థానానికి పోటీ చేశారు. బ్యాలెట్పై అదే పేరుతో ఉన్న టి.తిరుమావళవన్ అనే స్వతంత్ర అభ్యర్థికి 289 ఓట్లు పోలయ్యాయి. ఇదే ఆ స్థానం విజేతను నిర్ణయించింది. విజయం తారుమారైంది.
ప్రధాన పార్టీల్లో ఆందోళన..
తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు తొలి విడతలోనే జరుగుతున్నాయి. దాదాపు అన్నిచోట్లా ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య పోరు నడుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్రుల నుంచి విచిత్రమైన చిక్కు వచ్చి పడుతోంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ తరహా సవాలు ప్రధాన పార్టీలకు పలు లోక్సభ స్థానాల్లో ఎదురవుతోంది.
ఓట్లు చీల్చాలని..
వాస్తవానికి స్వతంత్రులకు ఓట్లు పెద్దగా రావు. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చడంలో కీలకంగా ఉంటారు. ఓడించేందుకు, తమ ఓటు బ్యాంకును దెబ్బ తీసేందుకు ప్రత్యర్థి పార్టీలు ఈ రకమైన కుట్రను పన్నుతున్నాయని పలు నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోటీలో ఉన్న స్వతంత్రులు కార్మికులు, గృహిణులు, పెద్దగా ఆస్తుల్లేని వారే ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే కూటముల అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఒకే పేరుతో ఉన్న స్వతంత్రుల్ని దింపినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు తమ పేర్లతో ఉన్నవారు 18 పార్లమెంటు స్థానాల్లో పోటీ పడుతుండగా, ఇండియా కూటమి అభ్యర్థుల పేర్లతో 14 స్థానాల్లో ఈ పరీక్ష కొనసాగుతోంది. ఎన్డీయే కూటమికి 6 చోట్ల ఈ పరిస్థితి ఉంది. కనీసం ఒకరి నుంచి గరిష్ఠంగా ఐదుగురు అవే పేర్లున్న స్వతంత్రులు బరిలో ఉన్నారు.
ఎత్తుగడ వెనుక అసలు సంగతి ఇదీ..
ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. అంతకు మించితే మరొక ఈవీఎంకు అవకాశమిస్తారు. ఎక్కడైతే అదనపు ఈవీఎంలకు అవకాశమిస్తున్నారో.. ఆయా స్థానాల్లో ప్రధాన అభ్యర్థి పేరును పోలిన స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. మొదటి ఈవీఎంలో ప్రధాన అభ్యర్థుల పేర్లు పై వరుసలోనే రానున్నాయి. రెండో, మూడో ఈవీఎంలకు వచ్చేసరికి.. అదే పేరున్న స్వతంత్రులు పైకొచ్చే అవకాశముంది. ఫలితంగా ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 950 మంది బరిలో ఉండగా 29 నియోజకవర్గాల్లో అదనపు ఈవీఎంల అవసరం పడుతోంది.
బాధితులవుతారా..?
- పెరంబలూరు డీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కె.ఎన్.నెహ్రూ తనయుడు కె.ఎన్.అరుణ్ నెహ్రూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే నియోజవర్గంలో అరుణ్ నెహ్రూ, ఎన్.అరుణ్ నెహ్రూ, జె.అరుణ్ నెహ్రూ పేర్లతో మరో ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
- రామనాథపురంలో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న ఒ.పన్నీరుసెల్వం పరిస్థితి మరీ దారుణం. ఇంటిపేరు ‘ఒ’తో కలుపుకొని ఆయన పేరుతో నలుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఎం.పన్నీరు సెల్వం పేరుతో ఇంకొకరున్నారు. ఆరుగురు ఒకే పేరుతో పోటీ పడుతున్నారు.
- వేలూరులోనూ అంతే. భాజపా అభ్యర్థి ఎ.సి.షణ్ముగం పేరుతో ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి పశుపతి పేరుతోనే మరొకరున్నారు.
- అత్యంత కీలకంగా మారిన కోయంబత్తూరు ఎన్నికలో డీఎంకే అభ్యర్థి గణపతి పి.రాజ్కుమార్కు పోటీగా స్వతంత్రులు అదే పేర్లతో ఐదుగురున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి సింగై జి.రామచంద్రన్ పేరును పోలిన ఎం.రామచంద్రన్, ఆర్.రామచంద్రన్, ఎన్.రామచంద్రన్, రామచంద్రన్ పేర్లతో కొందరు పోటీపడుతున్నారు.
- కరూరు లోక్సభ స్థానానికి అత్యధికంగా 54 మంది బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి పేరుతో ఇంకో ఇద్దరు బరిలో ఉన్నారు. శివగంగై కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరానికి పోటీగా కార్తీ పేరుతో ఇద్దరున్నారు. తిరుచ్చిలో ఎండీఎంకే అభ్యర్థి, వైగో కుమారుడు దురై వైగోకు పోటీగా.. దురై పేరు వచ్చేలా ముగ్గురు బరిలో ఉన్నారు.
- ధర్మపురి స్థానంలో డీఎంకే అభ్యర్థి ఎ.మణి పేరుతో నలుగురు, అన్నాడీఎంకే అభ్యర్థి అశోకన్ పేరుపై ఒకరు, పీఎంకే అభ్యర్థిని సౌమ్యా అన్బుమణికి పోటీగా సౌమ్యా పేరుతో ఇంకొకరు బరిలో ఉన్నారు. తిరువణ్ణామలై సిట్టింగ్ ఎంపీ, డీఎంకే అభ్యర్థి సి.ఎన్.అన్నాదురై పేరుతో ముగ్గురున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి