వరంగల్ భారాస అభ్యర్థిగా సుధీర్కుమార్
వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకూ భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.
ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకూ భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. హనుమకొండ జిల్లావాసి, ఆయుర్వేద వైద్యుడైన సుధీర్కుమార్ ప్రస్తుతం ఆ జిల్లా పరిషత్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆయన 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగిన వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో అధినేత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరితో చర్చించి, వారి సలహాలు, సూచనల మేరకు సుధీర్కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ స్థానం భారాసకు కంచుకోట వంటిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సుధీర్కుమార్ విజయం సాధించాలని నాయకులకు అధినేత సూచించారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదని భరోసా ఇచ్చారు.
పలు పేర్ల పరిశీలన అనంతరం..
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా గతంలోనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేరును పరిశీలించారు. కానీ తాను పోటీ చేయనని రమేశ్ ప్రకటించడంతో.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ఎంపిక చేశారు. అనంతర పరిణామాల్లో అరూరి రమేశ్ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా వరంగల్ లోక్సభ బరిలో నిలిచారు. వరంగల్ సిటింగ్ భారాస ఎంపీ పసునూరి దయాకర్ కూడా భారాసకు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇంతలో కడియం కావ్య.. తాను పోటీ చేయలేనంటూ అధినేత కేసీఆర్కు లేఖ రాసి వైదొలగారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కావ్యను కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఎంపిక చేసిన అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొని, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో విస్మయానికి గురైన భారాస పార్టీ.. వరంగల్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరించింది. గతంలోనే భారాసకు రాజీనామా చేసిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఈ సమావేశానికి పిలిచారని, ఆయనే అభ్యర్థి కావొచ్చని ప్రచారం జరిగినా.. అది వాస్తవం కాదని, ఆయన ఈ భేటీకి హాజరు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ముగ్గురు అభ్యర్థులవీ భారాస మూలాలే
వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ భారాస పార్టీ మూలాలున్న వారే కావడం గమనార్హం. తాజాగా భారాస అభ్యర్థిగా ప్రకటించిన మారేపల్లి సుధీర్కుమార్ 2001 నుంచి భారాసలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అంతకుముందు భారాస అభ్యర్థిగా కొద్దిరోజులు ప్రచారం కూడా చేశారు. భాజపా తరఫున పోటీ చేస్తున్న అరూరి రమేశ్ 2014, 2018 ఎన్నికల్లో భారాస నుంచి వర్ధన్నపేట బరిలో నిలిచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లోనూ ఆయన భారాస నుంచే పోటీ చేసి ఓటమి చెంది.. తాజాగా భాజపాలో చేరి ఎంపీ అభ్యర్థిగా టికెట్టు పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు