వరంగల్ భారాస అభ్యర్థిగా సుధీర్కుమార్
వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకూ భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.
ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకూ భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. హనుమకొండ జిల్లావాసి, ఆయుర్వేద వైద్యుడైన సుధీర్కుమార్ ప్రస్తుతం ఆ జిల్లా పరిషత్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆయన 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగిన వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో అధినేత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరితో చర్చించి, వారి సలహాలు, సూచనల మేరకు సుధీర్కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ స్థానం భారాసకు కంచుకోట వంటిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సుధీర్కుమార్ విజయం సాధించాలని నాయకులకు అధినేత సూచించారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదని భరోసా ఇచ్చారు.
పలు పేర్ల పరిశీలన అనంతరం..
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా గతంలోనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేరును పరిశీలించారు. కానీ తాను పోటీ చేయనని రమేశ్ ప్రకటించడంతో.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ఎంపిక చేశారు. అనంతర పరిణామాల్లో అరూరి రమేశ్ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా వరంగల్ లోక్సభ బరిలో నిలిచారు. వరంగల్ సిటింగ్ భారాస ఎంపీ పసునూరి దయాకర్ కూడా భారాసకు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇంతలో కడియం కావ్య.. తాను పోటీ చేయలేనంటూ అధినేత కేసీఆర్కు లేఖ రాసి వైదొలగారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కావ్యను కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఎంపిక చేసిన అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొని, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో విస్మయానికి గురైన భారాస పార్టీ.. వరంగల్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరించింది. గతంలోనే భారాసకు రాజీనామా చేసిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఈ సమావేశానికి పిలిచారని, ఆయనే అభ్యర్థి కావొచ్చని ప్రచారం జరిగినా.. అది వాస్తవం కాదని, ఆయన ఈ భేటీకి హాజరు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ముగ్గురు అభ్యర్థులవీ భారాస మూలాలే
వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ భారాస పార్టీ మూలాలున్న వారే కావడం గమనార్హం. తాజాగా భారాస అభ్యర్థిగా ప్రకటించిన మారేపల్లి సుధీర్కుమార్ 2001 నుంచి భారాసలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అంతకుముందు భారాస అభ్యర్థిగా కొద్దిరోజులు ప్రచారం కూడా చేశారు. భాజపా తరఫున పోటీ చేస్తున్న అరూరి రమేశ్ 2014, 2018 ఎన్నికల్లో భారాస నుంచి వర్ధన్నపేట బరిలో నిలిచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లోనూ ఆయన భారాస నుంచే పోటీ చేసి ఓటమి చెంది.. తాజాగా భాజపాలో చేరి ఎంపీ అభ్యర్థిగా టికెట్టు పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం