అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్?
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు.
తుపాను వస్తే రెడ్కార్పెట్పై పర్యటిస్తారా?
ప్రభుత్వ చర్యలతో డెల్టాకు అన్యాయం
పోలవరం పూర్తయితే 3 పంటలకు నీళ్లు
దళితులపై దాడులు చేసిన వైకాపాకు ఓటేస్తారా?
బాపట్ల జిల్లా ప్రజాగళం సభల్లో చంద్రబాబు
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను చంపేశారు. మాస్కు పెట్టుకోలేదని ఒంగోలులో విక్రం అనే యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగుతున్నారు. చీరాలలో ఇసుక ట్రాక్టర్లో శవం వచ్చింది. గత ఐదేళ్లలో వైకాపా వారు దళితులపై సాగించిన దాడులు అన్నీఇన్నీ కావు. 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. చివరకు అంబేడ్కర్ విద్యాదీవెన పేరు మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడిన ఈ ఉన్మాద సీఎంకు ఏ దళితుడైనా ఓటేస్తారా?’’
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, బాపట్ల: రైతు ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ అయిదేళ్లలో అయిదు సార్లయినా పొలాల్లో తిరిగినట్లు నిరూపిస్తారా, ఆయనకు వ్యవసాయం గురించి తెలుసా అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ‘మిగ్జాం తుపానుతో రైతులు పంట నష్టపోతే నేను పరామర్శకు వెళ్లేదాకా జగన్లో చలనమే రాలేదు. నేనొస్తున్నానని హడావిడిగా బాపట్లలో హైవే పక్కన రెడ్కార్పెట్ వేయించుకుని రైతులను దూరం నుంచి పలకరించారు. ఓట్ల కోసం రైతులను ముద్దులు పెట్టుకొని, గెలిచాక పిడిగుద్దులు గుద్దుతున్నార’ని మండిపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరు, రేపల్లెలో శుక్రవారం ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు షోల్లో పాల్గొని, అనంతరం ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్, వేమూరు, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థులు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్లను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే..
నాపై కక్షతో పట్టిసీమ నిర్వీర్యం
కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నేనానాడు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టాను. నెల రోజుల ముందే రైతులు సాగు చేసుకుని తుపాన్ల కంటే ముందుగానే పంటలు పండించుకున్నారు. నాపై కోపంతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి, డెల్టా రైతులను ఇబ్బందుల పాల్జేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే ఉమ్మడి గుంటూరులో మూడో పంటకూ నీరివ్వొచ్చు. కానీ జగన్ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. ఓ ఏడాది కరవు, మరో ఏడాది తుపాను వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాల కన్నా జగన్ అసమర్థ పాలన వల్లే ఎక్కువ నష్టం వాటిల్లింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోగా, కొన్నవాటికీ డబ్బులు ఇవ్వలేదు. ధాన్యాన్ని స్థానికంగా కొనుగోలు చేయకుండా, మంగళగిరి, విజయవాడ మిల్లులకు తరలించి అమ్ముకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఎన్నికల వేళ రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. సంక్షేమ పాలన కావాలో, సంక్షోభ పాలన కావాలో రైతులే నిర్ణయించుకోవాలి. జగన్కు నిర్మించడం చేతకాదు, కానీ విధ్వంసమే తెలుసు. ప్రజావేదిక కూల్చివేత సహా జగన్ సభలకు వస్తుంటే రోడ్లను ధ్వంసం చేయడం, చెట్లు నరకడం ఈ అయిదేళ్లలో ఎన్నో చూశాం. పాము తాను పెట్టిన గుడ్లను తానే మింగినట్లు జగన్ తనకు ఓట్లేసిన వారినే పన్నులతో బాదుతున్నారు. ప్రజలు ఇవన్నీ గుర్తెరిగి విజ్ఞతతో ఓటేయాలి. సకాలంలో డీఏలు, ఇంక్రిమెంట్లు రాక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడమే ఇందుకు నిదర్శనం.
జగన్ను దించేయడమే తరువాయి..
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని దించాలనే అభిప్రాయానికి జనం వచ్చారు. నెత్తిన పెట్టుకున్న వైకాపా కుంపటిని మే 13న దించుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపాలో రౌడీలున్నారు. కొందరు మంచివారూ ఉన్నారు. రాష్ట్రం కోసం ఆలోచించే వారికి తెదేపా స్వాగతం పలుకుతుంది. ఈ రోజు సీఎం కూడా గుంటూరులోనే ఉన్నారు. వాళ్లు ఒక్కో సభకు రూ.20 కోట్లు ఖర్చుపెట్టి మద్యం, బిర్యానీ ఇస్తూ, 1,500 బస్సుల్లో జనాల్ని తరలించారు. కానీ మా సభలకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్తో నిర్వహించిన సభలకు పోటెత్తారు. ఐదేళ్లలో జగన్ ప్రజలకు కాదు కదా, కనీసం మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పేదల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
పవన్ చెప్పిన వాటికి ఓకే
తెదేపా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తాం. వీటితో పాటు మరో నాలుగు పాయింట్లను కలపాలని పవన్ కల్యాణ్ సూచించగా, ఒప్పుకొన్నాం. తెదేపా సూపర్ సిక్స్ పథకాలకు, వైకాపా నవరత్నాలకు తేడా తెలుసుకోవాలి. బీసీలకు ఏటా రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు వెచ్చిస్తాం. ఓట్లు అడగటానికి వచ్చే వైకాపా నేతల్ని కరెంటు బిల్లులు చూపించి నిగ్గదీయాలి. మాది మహిళా పక్షపాత పార్టీ. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ. వారికి అన్నివిధాలా అండగా ఉంటా. సీఎం స్వయంగా వాలంటీర్లను రాజీనామా చేయాలనడం సిగ్గుచేటు. అలా చేసి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. మీకు అండగా మేముంటాం.
జేబు దొంగలకే జగన్ టికెట్లిచ్చారు
జగన్ టికెట్లు ఇచ్చిన వాళ్లలో జేబు దొంగలు, భూకబ్జాదారులు, ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లర్లు, నమ్మక ద్రోహులే ఉన్నారు. రాజధానిలో రోడ్లు తవ్వి, కంకర దొంగిలించిన వ్యక్తి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయనకు పోటీగా నిజాయతీగా పనిచేసి, అక్రమార్కుల ఆటకట్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ఉన్నారు. విద్యావంతులు కావాలో, రౌడీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. తన సోదరిని వేధించాడని వైకాపా కార్యకర్తను ప్రశ్నించిన పాపానికి బీసీ విద్యార్థి ఉప్పాల అమరనాథ్గౌడ్ను దారుణంగా చంపినా, ఆ నిందితుడికి సరైన శిక్ష వేయలేదు. తెదేపా పాలనలో అయితే కఠిన శిక్ష పడేది. సీఎంకు సిగ్గుంటే ఉప్పాలవారిపాలెం వెళ్లి అమరనాథ్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ