అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్?
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు.
తుపాను వస్తే రెడ్కార్పెట్పై పర్యటిస్తారా?
ప్రభుత్వ చర్యలతో డెల్టాకు అన్యాయం
పోలవరం పూర్తయితే 3 పంటలకు నీళ్లు
దళితులపై దాడులు చేసిన వైకాపాకు ఓటేస్తారా?
బాపట్ల జిల్లా ప్రజాగళం సభల్లో చంద్రబాబు
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను చంపేశారు. మాస్కు పెట్టుకోలేదని ఒంగోలులో విక్రం అనే యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగుతున్నారు. చీరాలలో ఇసుక ట్రాక్టర్లో శవం వచ్చింది. గత ఐదేళ్లలో వైకాపా వారు దళితులపై సాగించిన దాడులు అన్నీఇన్నీ కావు. 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. చివరకు అంబేడ్కర్ విద్యాదీవెన పేరు మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడిన ఈ ఉన్మాద సీఎంకు ఏ దళితుడైనా ఓటేస్తారా?’’
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, బాపట్ల: రైతు ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ అయిదేళ్లలో అయిదు సార్లయినా పొలాల్లో తిరిగినట్లు నిరూపిస్తారా, ఆయనకు వ్యవసాయం గురించి తెలుసా అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ‘మిగ్జాం తుపానుతో రైతులు పంట నష్టపోతే నేను పరామర్శకు వెళ్లేదాకా జగన్లో చలనమే రాలేదు. నేనొస్తున్నానని హడావిడిగా బాపట్లలో హైవే పక్కన రెడ్కార్పెట్ వేయించుకుని రైతులను దూరం నుంచి పలకరించారు. ఓట్ల కోసం రైతులను ముద్దులు పెట్టుకొని, గెలిచాక పిడిగుద్దులు గుద్దుతున్నార’ని మండిపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరు, రేపల్లెలో శుక్రవారం ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు షోల్లో పాల్గొని, అనంతరం ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్, వేమూరు, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థులు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్లను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే..
నాపై కక్షతో పట్టిసీమ నిర్వీర్యం
కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నేనానాడు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టాను. నెల రోజుల ముందే రైతులు సాగు చేసుకుని తుపాన్ల కంటే ముందుగానే పంటలు పండించుకున్నారు. నాపై కోపంతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి, డెల్టా రైతులను ఇబ్బందుల పాల్జేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే ఉమ్మడి గుంటూరులో మూడో పంటకూ నీరివ్వొచ్చు. కానీ జగన్ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. ఓ ఏడాది కరవు, మరో ఏడాది తుపాను వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాల కన్నా జగన్ అసమర్థ పాలన వల్లే ఎక్కువ నష్టం వాటిల్లింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోగా, కొన్నవాటికీ డబ్బులు ఇవ్వలేదు. ధాన్యాన్ని స్థానికంగా కొనుగోలు చేయకుండా, మంగళగిరి, విజయవాడ మిల్లులకు తరలించి అమ్ముకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఎన్నికల వేళ రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. సంక్షేమ పాలన కావాలో, సంక్షోభ పాలన కావాలో రైతులే నిర్ణయించుకోవాలి. జగన్కు నిర్మించడం చేతకాదు, కానీ విధ్వంసమే తెలుసు. ప్రజావేదిక కూల్చివేత సహా జగన్ సభలకు వస్తుంటే రోడ్లను ధ్వంసం చేయడం, చెట్లు నరకడం ఈ అయిదేళ్లలో ఎన్నో చూశాం. పాము తాను పెట్టిన గుడ్లను తానే మింగినట్లు జగన్ తనకు ఓట్లేసిన వారినే పన్నులతో బాదుతున్నారు. ప్రజలు ఇవన్నీ గుర్తెరిగి విజ్ఞతతో ఓటేయాలి. సకాలంలో డీఏలు, ఇంక్రిమెంట్లు రాక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడమే ఇందుకు నిదర్శనం.
జగన్ను దించేయడమే తరువాయి..
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని దించాలనే అభిప్రాయానికి జనం వచ్చారు. నెత్తిన పెట్టుకున్న వైకాపా కుంపటిని మే 13న దించుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపాలో రౌడీలున్నారు. కొందరు మంచివారూ ఉన్నారు. రాష్ట్రం కోసం ఆలోచించే వారికి తెదేపా స్వాగతం పలుకుతుంది. ఈ రోజు సీఎం కూడా గుంటూరులోనే ఉన్నారు. వాళ్లు ఒక్కో సభకు రూ.20 కోట్లు ఖర్చుపెట్టి మద్యం, బిర్యానీ ఇస్తూ, 1,500 బస్సుల్లో జనాల్ని తరలించారు. కానీ మా సభలకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్తో నిర్వహించిన సభలకు పోటెత్తారు. ఐదేళ్లలో జగన్ ప్రజలకు కాదు కదా, కనీసం మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పేదల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
పవన్ చెప్పిన వాటికి ఓకే
తెదేపా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తాం. వీటితో పాటు మరో నాలుగు పాయింట్లను కలపాలని పవన్ కల్యాణ్ సూచించగా, ఒప్పుకొన్నాం. తెదేపా సూపర్ సిక్స్ పథకాలకు, వైకాపా నవరత్నాలకు తేడా తెలుసుకోవాలి. బీసీలకు ఏటా రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు వెచ్చిస్తాం. ఓట్లు అడగటానికి వచ్చే వైకాపా నేతల్ని కరెంటు బిల్లులు చూపించి నిగ్గదీయాలి. మాది మహిళా పక్షపాత పార్టీ. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ. వారికి అన్నివిధాలా అండగా ఉంటా. సీఎం స్వయంగా వాలంటీర్లను రాజీనామా చేయాలనడం సిగ్గుచేటు. అలా చేసి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. మీకు అండగా మేముంటాం.
జేబు దొంగలకే జగన్ టికెట్లిచ్చారు
జగన్ టికెట్లు ఇచ్చిన వాళ్లలో జేబు దొంగలు, భూకబ్జాదారులు, ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లర్లు, నమ్మక ద్రోహులే ఉన్నారు. రాజధానిలో రోడ్లు తవ్వి, కంకర దొంగిలించిన వ్యక్తి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయనకు పోటీగా నిజాయతీగా పనిచేసి, అక్రమార్కుల ఆటకట్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ఉన్నారు. విద్యావంతులు కావాలో, రౌడీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. తన సోదరిని వేధించాడని వైకాపా కార్యకర్తను ప్రశ్నించిన పాపానికి బీసీ విద్యార్థి ఉప్పాల అమరనాథ్గౌడ్ను దారుణంగా చంపినా, ఆ నిందితుడికి సరైన శిక్ష వేయలేదు. తెదేపా పాలనలో అయితే కఠిన శిక్ష పడేది. సీఎంకు సిగ్గుంటే ఉప్పాలవారిపాలెం వెళ్లి అమరనాథ్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే