కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం భారాస
తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంతర కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు మాయమైంది? ఇంటింటికీ తాగునీరు అందించిన అద్భుత పథకం మిషన్ భగీరథ.
పథకాలను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమిది
దళితబంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది
దళిత బిడ్డలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా
మతపిచ్చి పెంచడం తప్ప భాజపా చేసిందేముంది?
ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు
చేవెళ్ల సభలో కేసీఆర్
అభివృద్ధి కొనసాగాలంటే.. భారాసకే ఓటేయాలని వినతి
ఈనాడు, హైదరాబాద్: ‘తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంతర కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు మాయమైంది? ఇంటింటికీ తాగునీరు అందించిన అద్భుత పథకం మిషన్ భగీరథ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల తాగునీరు లభించడం లేదు. అమల్లో ఉన్న పథకాలను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమిది. దీన్ని సరిచేయడానికి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం భారాసయే. అందుకే అన్ని స్థానాల్లో భారాస అభ్యర్థులను గెలిపించాలి. లేకపోతే.. ఏం చేయకపోయినా ప్రజలు మాకే ఓటేస్తారనే అభిప్రాయం కాంగ్రెస్కు కలుగుతుంది’ అని భారాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో శనివారం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, భాజపాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించి కేసీఆర్ ప్రసంగించారు. ‘బలమైన ప్రతిపక్షం ఉండి, కొరడా ఝళిపిస్తూ.. మోసకారి కాంగ్రెస్కు చురకలు వేస్తేనే పనులవుతాయి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. నేను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తా. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే.. భారాసను గెలిపించి, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
‘రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నీళ్ల కష్టాలు ఉండేవి. కానీ వాటిని అధిగమించి రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతుల సంక్షేమం కోసం పట్టుపట్టి ఐదు పథకాలను అమలు చేశాం. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇచ్చాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. రూ.5 లక్షల రైతుబీమా అమలు చేశాం. పంటలను కొనుగోలు చేసి.. రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాం. 1100 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేశాం. అన్ని వర్గాల విద్యార్థులకు రూ.20 లక్షల విదేశీ స్కాలర్షిప్ ఇచ్చాం. దళితబంధు ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించాం. గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చాం. మత్స్యకారుల కోసం చేపలు పెంచాం. చేనేత కార్మికులకు పని కల్పించాం. గౌడ కులస్థులకు అండగా నిలిచాం. బీసీ బంధుతో బలహీనవర్గాల వారిని ఆదుకున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ పోతుంటే.. బాధ కలుగుతోంది. కాంగ్రెస్ వాళ్లు దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఐదు నెలలు గడిచినా.. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. భారాస హయాంలో మంజూరు చేసిన దళితబంధు చెక్కులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుందా? లేదా? ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. దళితబంధు లబ్ధిదారులు, దళిత బిడ్డలతో కలిసి సచివాలయం వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా.
ప్రభుత్వం మెడలు వంచి.. దళితబంధు ఇప్పిస్తాం.
కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో అన్ని పంటలు కొంటామన్నారు. బోనస్ ఇస్తామన్నారు. కానీ ఏదీ లేదు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు లేవు కానీ.. భయంకరమైన లూటీలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనాలి. హామీలను అమలు చేసే దాకా వెంటాడతాం.
భాజపాకు నూకలు బుక్కిద్దాం..
పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. మతపిచ్చి లేపడం తప్ప, ఏదైనా మంచి పని చేసిందా? ఆ పార్టీలో చేరడమా? లేదా జైలుకు పోవడమా? అన్నట్లుంది పరిస్థితి. అయితే మోదీ.. లేదంటే ఈడీ? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి? దేశం మొత్తమ్మీద 150 వైద్య కళాశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల కూడా మంజూరు చేయలేదు. 100కి పైగా లేఖలు రాశా. స్వయంగా మోదీని కలిసి విన్నవించా. అయినా ఇవ్వలేదు. సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పగించింది భాజపా. మన ఐటీఐఆర్ను రద్దు చేసింది వాళ్లే. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టలేదు. దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయలేదు. అలాంటి భాజపాకు మనం ఎందుకు ఓటేయాలి? ఇదే మోదీ.. నా మెడ మీద కత్తి పెట్టి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు. కానీ ప్రాణం పోయినా సరే పెట్టనని చెప్పా. సంవత్సరానికి రూ.5 వేల కోట్ల చొప్పున రూ.30 వేల కోట్ల మేర కేంద్రం కోత పెట్టినా మేం మీటర్లు పెట్టలేదు. ఇప్పుడు భాజపాకు ఓటేస్తే.. వాళ్లు మీటర్లు పెడతారు. భాజపాను ఓటుతో కొట్టాలి. మనల్ని నూకలు తినమన్న ఆ పార్టీకి నూకలు బుక్కిద్దాం.
అధికారం ఎటుంటే అటు మారతారా?
ఎన్నికలొస్తుంటాయి. పోతుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వమంటే ప్రజల్లో ధీమా, ధైర్యం, విశ్వాసం ఉండాలి. ఇంతకుముందు సభల్లో నేను పదే పదే చెప్పా.. ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలని. ఏ మాత్రం దెబ్బ తగిలినా.. చాలా నష్టం జరుగుతుందని చెప్పా. కానీ కాంగ్రెస్ ప్రలోభాల కారణంగా ఆ పార్టీకి అధికారం దక్కింది. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా.. చిత్తశుద్ధి, కార్యాచరణ లేదు. వసతులు, వనరులు వాడుకునే నైపుణ్యం కనిపించడం లేదు. భారాస పుణ్యాన గెలిచిన రంజిత్రెడ్డికి ఏం తక్కువ చేశాం? ఆయనేమైనా పొద్దు తిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు మారతారా? పదవులు, పనుల కోసమే రంజిత్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. భాజపా అభ్యర్థి కూడా ఇక్కడి ప్రజలకు తెలియనివారేం కాదు. వీరికి దీటైన దెబ్బకొట్టాలి. చేవెళ్ల భారాస అభ్యర్థి, బలహీనవర్గాల బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలి’ అని కేసీఆర్ కోరారు.
సమన్వయంతో సభ విజయవంతం
చేవెళ్ల, న్యూస్టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భారాస తొలిసారిగా చేవెళ్లలో నిర్వహించిన సభ విజయవంతమైంది. పార్టీ నాయకులు, శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభను విజయవంతం చేశారు. కేసీఆర్ ప్రసంగానికి గతంలో మాదిరే మంచి స్పందన లభించింది. సభకు చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో పాటు ఎమ్మెల్యేలు సబితారెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి తదితరులు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సభ విజయవంతం కావడంలో భాగస్వాములయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!