అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్లో పోరు ఆసక్తికరంగా మారింది.
దేవెగౌడ కంచుకోట హసన్ ఎవరికో?
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్లో పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే లోక్సభ స్థానం నుంచి ప్రత్యర్థులుగా ఇద్దరు ప్రముఖ నేతలు ముఖాముఖి తలపడగా...ఇప్పుడు వారి మనవళ్లు అదే బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హసన్: కర్ణాటకలోని హసన్.. ఒకప్పటి హొయసల సామ్రాజ్య రాజధాని. దేశానికి తొలి కన్నడిగ ప్రధానిని అందించిన నియోజకవర్గం. జేడీఎస్ అధినేత దేవెగౌడకు పెట్టని కోట. చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన ఈ ప్రాంతంలో లోక్సభ ఎన్నికల పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల మధ్యే అధికార పోరు నడుస్తుండగా.. తాజా ఎన్నికల్లో వారి మూడో తరం తలపడుతోంది. హసన్ లోక్సభ స్థానానికి మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ భాజపా-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ఆయనే మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రజ్వల్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ 31 ఏళ్ల శ్రేయస్ ఎం.పటేల్ను నిలబెట్టింది. ఈయన కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జి.పుట్టస్వామి గౌడ మనవడు. గతంలో ఇదే స్థానం నుంచి దేవెగౌడ, పుట్టస్వామిలు పోటీ చేయగా.. ఇప్పుడు వారి మనవళ్లు ప్రత్యర్థులుగా నిలవడం విశేషం.
ఆధిపత్యం ఆ కుటుంబానిదే
హసన్ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్.డి.రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్.జి.అనుపమకూ ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు.
వక్కలిగల మద్దతు ఎవరికో?
కర్ణాటకలో రెండో అతిపెద్ద సామాజిక వర్గం అయిన వక్కలిగల ప్రాబల్యం హసన్లో చాలా ఎక్కువ. దేవెగౌడ, పుట్టస్వామి కుటుంబాలు ఇదే సామాజిక వర్గానికి చెందినవే అయినా ఉప కులాలు వేరు. పుట్టస్వామి దాస వక్కలిగ కాగా.. దేవెగౌడ కుటుంబానిది ముల్లు వక్కలిగ వర్గం. హసన్ నియోజకవర్గంలో దాస వక్కలిగ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం శ్రేయస్ పటేల్కు కలిసొచ్చే అంశం. దీంతో 1999 నాటి తన తాత విజయాన్ని పునరావృతం చేయగలనని ఈయన ధీమాగా ఉన్నారు. ఇక, ప్రజ్వల్పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. అవినీతి ఆరోపణలతో పాటు భాజపాతో పొత్తు పెట్టుకోవడం జేడీఎస్లో కొందరికి రుచించలేదు. కుటుంబ ప్రాబల్యంతో పాటు మోదీ పాపులారిటీతో కాషాయ ఓటు బ్యాంకు కూడా తనకు దక్కుతుందని ఈ యువ ఎంపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హసన్ పరిధిలోని నాలుగు శాసనసభ స్థానాల్లో జేడీఎస్ అధికారంలో ఉండగా.. భాజపా, కాంగ్రెస్కు చెరో రెండు స్థానాలున్నాయి. ఈ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
మనవడి కోసం మాజీ ప్రధాని త్యాగం..
హసన్ లోక్సభ స్థానం నుంచి దేవెగౌడ ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మనవడి కోసం ఈ స్థానాన్ని త్యాగం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్ 1.41లక్షల మెజార్టీతో విజయం సాధించారు. జేడీఎస్ తరఫున ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే.
నాడు దేవెగౌడను ఓడించి..
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హొళెనరసిపుర స్థానం నుంచి అప్పటి జనతా పార్టీ అభ్యర్థిగా దేవెగౌడ బరిలోకి దిగగా.. ఆయనపై తొలిసారి పుట్టస్వామి పోటీ చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా తలపడిన పుట్టస్వామి ఓడిపోయారు. అయితే, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి దేవెగౌడను ఓడించారు. 1999 లోక్సభ ఎన్నికల్లో హసన్ నుంచి దేవెగౌడపై పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పుట్టస్వామి మళ్లీ గెలుపొందలేకపోయారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!