హామీల అమలులో కాంగ్రెస్, భారాస విఫలం
తమ పార్టీ సంకల్ప పత్రం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, భారాసలకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు.
యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా భాజపా పనిచేస్తుంది: కిషన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తమ పార్టీ సంకల్ప పత్రం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, భారాసలకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. భాజపా సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్ భారత్ డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన భారాస దళితుడిని సీఎంను చేస్తామన్న హామీనే అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి, దళిత బంధు, ఇంటింటికి నీరు సహా హామీల అమల్లో అది విఫలమైందని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ఆ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎంతమందికి.. ఎన్ని ఎకరాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన 13 హామీలను వదిలేసిందని అన్నారు. చెక్బౌన్స్లు, బ్లాక్మెయిల్ చేయడం, తప్పుడు ఐటీ రిటర్న్ల దాఖలు.. కాంగ్రెస్ నేతల సంస్కృతి అని విమర్శించారు. ఇటువంటి అంశాల్లో తాము కాంగ్రెస్తో పోటీపడలేమని అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ విడుదల చేసింది ఎన్నికల ప్రణాళిక కాదని అది భాజపా సంకల్పమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న ఐదేళ్లు.. యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా భాజపా పనిచేస్తుందన్నారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి, దేశ భద్రత దిశగా మరిన్ని పటిష్ఠ చర్యలకు నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు భాజపా మద్దతు ఇచ్చి మాట నిలబెట్టుకుందని అన్నారు. మోదీ పాలనలో అభివృద్ధి.. అంతకుముందు అభివృద్ధిపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు సహా ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని అన్నారు.
హింస ఏ రూపంలో ఉన్నా భాజపా సహించదు
ఏపీ సీఎం జగన్పై దాడిని ఖండిస్తున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా భాజపా సహించదని అన్నారు.
రేవంత్ అసమర్థుడు కాదు.. కాంగ్రెస్ది అసమర్థ ప్రభుత్వం: ఎంపీ అర్వింద్
రాష్ట్రంలో అవినీతి భారాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపితే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని భాజపా ఎంపీ అర్వింద్ అన్నారు. సీనియర్లు అసెంబ్లీకి వెళ్లడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్కు అభ్యర్థులే దొరకడంలేదని ఇతర పార్టీల నుంచి తెచ్చుకొని నిలబెడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి అసమర్థుడు కాదని, కాంగ్రెస్ది అసమర్థ ప్రభుత్వమని అన్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో ఉంటే అసమర్థుడిగా మారతారని అన్నారు. ఆయన భాజపాలో చేరతానంటే మిత్రుడిగా స్వాగతించి సిఫార్సు చేస్తానని చెప్పారు.
నేడు రైతు దీక్ష
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం కిషన్రెడ్డి రైతు దీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షలో పాల్గొంటారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి