పరకాల కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ‘కొండా’ వర్గీయుల సస్పెన్షన్
హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో పరకాల ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్ఛార్జి రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా జరిగింది.
రసాభాసగా లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం
పరకాల, పరకాల రూరల్, న్యూస్టుడే: హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో పరకాల ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్ఛార్జి రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా జరిగింది. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. తమకు తెలియకుండా ఇటీవల పలు మండలాలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై కొండా వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి సురేఖ లేకుండానే సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని, కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యమివ్వడం లేదంటూ కొండా వర్గానికి చెందిన ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ఛైర్మన్ గజ్జి విష్ణు ఘర్షణకు దిగారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వేదికపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితర నాయకులున్నారు. సమావేశం ప్రారంభం కాగానే.. కొండా వర్గీయులు కొండా దంపతుల నేతృత్వంలో పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గజ్జి విష్ణు, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విష్ణు వర్గీయులు రాస్తారోకో చేశారు. సీఐ రవిరాజు వారికి నచ్చజెప్పి విష్ణును బయటకు తీసుకురావడంతో అందరూ కలిసి సమావేశ మందిరానికి చేరుకున్నారు. గజ్జి విష్ణును, ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!