సీఎం పర్యటిస్తుంటే విద్యుత్తు ఎందుకు నిలిపేశారు?
‘రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారు? ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది?’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు.
చీకట్లో బస్సు మీదే ఎందుకు నిలబెట్టారు?
డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై చర్యలు తీసుకోవాలి
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారు? ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది?’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారు? వీవీఐపీలను ఎక్కడా ఇలా చీకట్లో ఊరేగించరు. బస్సులో కూర్చోబెట్టకుండా అలా నిలబెట్టడం డ్రామాలో భాగం కాదా?’ అని నిలదీశారు. జరిగిన సన్నివేశాలన్నీ చూస్తే జగన్పై జరిగిన గులకరాయి దాడి అంతా డ్రామానే అని స్పష్టం చేశారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిచాయని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి పర్యటించేటప్పుడు ఆ మార్గంలో విద్యుత్తు సరఫరా నిలిపేయడం ముందస్తు వ్యూహంలో భాగమేనన్నారు. దాడి జరిగాక కొన్ని క్షణాల్లోనే పోస్టర్లు, బ్యానర్లతో వైకాపా నేతలు, ఆ పార్టీ పెయిడ్ బ్యాచ్ ధర్నాలు చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. సానుభూతి పొంది కొన్ని ఓట్లు సంపాదించడానికే హైడ్రామా నడిపారని మండిపడ్డారు. ‘దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టాలి. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమిషనర్పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికలు సజావుగా జరగకుండా వైకాపా కుట్ర పన్నింది. దాడి జరిగిన వెంటనే వైకాపా నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించారు. గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికత్తి నాటకాలు ఆడారు. ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. కోడికత్తి డ్రామాలో దళిత యువకుడు శ్రీను అయిదేళ్లు జైలులో మగ్గారు’ అని పేర్కొన్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం వైకాపా నేతలకు ఉందా?
దాడి ఘటనపై వైకాపా నేతలకు పట్టాభి పలు ప్రశ్నలు సంధించారు. చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.
ప్రశ్న 1 : సీఎం భద్రతా సిబ్బంది వద్ద బుల్లెట్ప్రూఫ్ షీట్లు ఉండగా వాటిని ఎందుకు తెరవలేదు? ఇలాంటి దాడులు జరిగినప్పుడు వీవీఐపీకి వాటిని అడ్డుగా పెట్టి రక్షణగా నిలుస్తారు. కానీ సీఎంపై దాడి జరిగాక ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది వాటిని వాడలేదు?
ప్రశ్న 2 : సీఎంకి గాయమైన వెంటనే బస్సులోకి గానీ, మరో సురక్షితమైన వాహనంలోకి గానీ ఎందుకు తీసుకెళ్లలేదు? బస్సుపైనే ఎందుకు నిలబెట్టారు? భద్రతా ప్రొటోకాల్ ప్రకారం ఏ చిన్న దాడి జరిగినా ముఖ్యమంత్రిని వేరే వాహనంలో అక్కడి నుంచి తప్పిస్తారు. కానీ ఏ డ్రామాలో భాగంగా జగన్ను వాహనం మార్చకుండా అదే వాహనంలో కొనసాగించారు?
ప్రశ్న 3 : గాయపడిన వెంటనే వైద్య సిబ్బందిని పిలవకుండా ముఖ్యమంత్రికి టవల్ ఇచ్చి ఆయన గాయాన్ని ఆయన్నే తుడుచుకోవాలని చెప్పడమేంటి? ఇది డ్రామాను రక్తి కట్టించడానికి, కావల్సిన విజువల్స్ ప్రసారం చేసుకోవడానికి కాదా?
ప్రశ్న 4 : సీఎం కాన్వాయ్లో కచ్చితంగా వైద్యుల బృందంతో పాటు అంబులెన్స్ ఉంటుంది. దాడికి గురైన వీవీఐపీకి ప్రథమచికిత్స చేసి తక్షణమే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లడానికే అంబులెన్స్ పెడతారు. అంబులెన్సుకు పాత్ర లేకుండా చేసింది కుట్రలో భాగం కాదా?
ప్రశ్న 5 : బస్సుయాత్రను కవర్ చేయడానికి మీడియాను ఎందుకు అనుమతించడంలేదు? మీ కుట్రలు, డ్రామాలు ప్రపంచానికి తెలిసిపోతాయనేనా? దాడి జరిగిన తర్వాత సాక్షిలో రిలీజ్ చేసిన ఫుటేజ్ పరిశీలిస్తే.. ముందుగా ముఖ్యమంత్రికి ఒక గజమాల వేసినట్లు, ఆ గజమాల పక్కకు తొలగించే సమయంలో ముఖ్యమంత్రి మొహం దగ్గరగా వెళ్లి, తర్వాత ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్ట్స్ విజువల్ ముఖ్యమంత్రి తలపైన ఏదో రాయి తగిలి నుదుటిపై చేయి పెట్టుకున్నట్లుంది. ఇలా ఎడిట్ చేసిన వీడియోలను సొంత మీడియా ద్వారా బయట ప్రపంచానికి చూపించి డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియా మొత్తాన్ని కవరేజికి అనుమతిస్తే.. నాటకాలు సాగవని భయమా?
ప్రశ్న 6 : దాడి జరిగిన నిమిషాల్లోనే ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకుని వైకాపా నేతలు రోడ్లపై ధర్నాలు చేశారు. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యులని బురద జల్లే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అంత తక్కువ వ్యవధిలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎలా తయారుచేశారు? స్క్రీన్ ప్లేలో భాగంగా ముందుగానే పోస్టర్లు, బ్యానర్లు ప్రింట్ చేయించుకొని దాడి సీన్ పూర్తవగానే ధర్నా సీన్కు తెరలేపిన మాట నిజం కాదా?
ప్రశ్న 7 : సాక్షి పత్రికలో ముఖ్యమంత్రికి తీవ్ర గాయాలైనట్లు వార్తలు ప్రచురించారు. మరి అంతటి తీవ్ర గాయాలైన వ్యక్తి ఘటన జరిగిన తర్వాత దాదాపు 2 గంటల పాటు తన బస్సుయాత్రను ఎలా కొనసాగించారు? ఇది నాటకాల్లోనే సాధ్యం కదా?
ప్రశ్న 8 : ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఫొటో షూట్లు ఎక్కడైనా జరుగుతాయా? అలా ఫొటోలు తీసింది సానుభూతి పొందడానికి కాదా? అసలు ఆపరేషన్ థియేటర్లో ఫొటోగ్రాఫర్లను అనుమతించకూడదు. అయినా ఫొటోషూట్లు చేశారంటే దాని అర్థమేంటి? ఏ యాంగిల్లో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలని నిర్ణయించుకుని మరీ ఫొటోలు తీసి ప్రచురించారు. దీన్ని మీ డ్రామాలో క్లైమాక్స్ సీన్ అని మేము అనుకోవాలా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్