మా నానీ, జోగీ, వంశీ, కిట్టూ.. ఎంతో సౌమ్యులు.. మంచోళ్లు!
‘పెనమలూరు నుంచి జోగి (మంత్రి జోగి రమేష్) నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. సౌమ్యుడు. మీ అందరి దీవెనలు, ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నా’ అని సీఎం జగన్ అభ్యర్థించారు.
అభ్యర్థులుగా పరిచయం చేస్తూ సీఎం జగన్ కితాబు
ఈనాడు, అమరావతి: ‘పెనమలూరు నుంచి జోగి (మంత్రి జోగి రమేష్) నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. సౌమ్యుడు. మీ అందరి దీవెనలు, ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నా’ అని సీఎం జగన్ అభ్యర్థించారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడులో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు పరిచయం చేశారు. మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు అనగానే జనాలు ఘొల్లుమన్నారు. గోల చేశారు. రమేష్ సౌమ్యుడట! ప్రతిపక్షాల మీద ఆయన తరచూ నోరుపారేసుకుంటారనే విమర్శలున్నాయి. జనాన్ని తీసుకొని మారణాయుధాలతో చంద్రబాబు ఇంటి మీదకు ఆయన దాడికి వెళ్లారు. పోలీసులు మాత్రం కేవలం ఆయన ప్రశ్నించేందుకే వెళ్లారని సమర్దించారు.
జోగి అనుచరులు మూడు నియోజకవర్గాల్లోనూ (మైలవరం, పెడన, ప్రస్తుతం పెనమలూరు) తమ అరాచకాలను విస్తరించారనే ఆరోపణలు ఉన్నాయి. మైలవరంలో జోగి వర్గం సొంత పార్టీ వారిపైనే దాడికి వెళ్లింది. ఆయన అనుచరులైన కొంతమంది యువకులు ఓ పెళ్లి బృందంపై దాడికి పాల్పడ్డారు. జోగి రమేష్ వర్గీయులు జి.కొండూరులో దేవినేని ఉమాపై దాడిచేశారు. పోలీసులు తిరిగి దేవినేని ఉమాపైనే కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఇక పెడనలో వసూలు రాజాలు సరేసరి. ఆయన పెనమలూరుకు వచ్చిన తర్వాత చేస్తున్న ఇసుక దందా అంతా ఇంతా కాదు. ఇక్కడ ఉంటూనే మైలవరంలో బూడిద దందా సాగిస్తున్న తీరు ‘ఆదర్శనీయమే’. ఇంత సౌమ్యుడు జోగి రమేష్.. ఆయనకు చల్లని దీవెనలు కావాలని జగన్ కోరడం విచిత్రంగా అనిపించింది.
అయిదోసారి కొడాలి మంచి చేస్తారట!
‘గుడివాడలో కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తాను కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు, నానిపై ఉంచాలని సవినయంగా కోరుతున్నాను!’ అని జగన్ విజ్ఞప్తి చేశారు. కొడాలి నానిని మాత్రం సౌమ్యుడిగా పేర్కొనలేదు. ఆయన ఇంకా చాలా మంచి చేస్తారని చెప్పారు. ‘ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు. రోడ్లు వేయలేదు. ఆర్వోబీ పూర్తి చేయలేదు. తెదేపా నిర్మించిన టిడ్కో ఇళ్లు పంచినా.. మౌలిక వసతులు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకూ మంచి చేయకపోయినా.. ఈసారి చేస్తారు’ అని కొడాలి నాని గురించి ముఖ్యమంత్రి చెప్పకనే గొప్పగా చెప్పారు. ఈసారి తానే దగ్గరుండి పనులు చేయిస్తానని సీఎం చెబుతున్నారంటే గత అయిదేళ్లూ సీఎం ఏమీ చేయించలేదన్నమాటేగా..!
బెదిరించే వల్లభనేని వంశీ.. సౌమ్యుడా..?
‘మీ అందరికీ తెలిసిన వ్యక్తి. మంచి వాడు. సౌమ్యుడు. నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు గన్నవరం అభ్యర్థి వంశీపై ఉంచాలి. మంచి చేస్తాడని నమ్మకం.. నాకు సంపూర్ణంగా ఉంది’ అని వంశీని సభలో సీఎం పరిచయం చేశారు. అయితే గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి జరగడానికి ప్రధాన సూత్రధారి వంశీ. యువగళం పాదయాత్రలో దాడులు జరగడానికి ప్రత్యక్ష పాత్రధారి. ఆయనే స్వయంగా పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తెదేపా నాయకులను బెదిరించి లొంగదీసుకోవడం లేదా కేసులు పెట్టించడమనే ‘మంచి పేరు’ ఆయనకు ఉంది. జాస్తి వెంకటేశ్వరావు ఆస్తులపై జేసీబీ పెట్టి కూల్చివేతలకు పాల్పడ్డారు. మరో రైస్ మిల్లర్పై తుపాకీ ఎక్కుపెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం. ఇలాంటి వంశీ సీఎం దృష్టిలో సౌమ్యుడు..!
సింహాద్రి రమేష్ది తెగబడేంత ‘మంచి’ వ్యక్తిత్వం
‘అవనిగడ్డ అభ్యర్థి రమేష్ కూడా మంచివాడు. సౌమ్యుడు. మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రమేష్ అన్నపై ఉంచాలని ప్రార్థిస్తున్నాను!’ అని సీఎం కోరారు. అవనిగడ్డలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలపై మారణాయుధంతో దాడికి తెగబడినంత సౌమ్యుడు ఈ ఎమ్మెల్యే. తన హోదా మరిచి బూతులతో దూషించిన ‘మంచివాడు’. తమ రహదారి బాగోలేదని తెలిపిన ఆటో డ్రైవర్లపై అంతెత్తున ఎగిరిపడిన ‘మంచివ్యక్తిత్వం’ ఉన్న ఎమ్మెల్యే.. తామే సొంతంగా మరమ్మతులు చేసుకుంటామని.. ముందుకు వచ్చిన ఆటోడ్రైవర్లను ఎవర్రా మీరు.. చేస్తే ప్రభుత్వం చేయాలి.. లేదంటే మీరు ఇబ్బందులు పడాలి. మీరు ఎందుకు మరమ్మతులు చేస్తార్రా అంటూ అధికార దాహంతో హెచ్చరించిన ‘గొప్ప’ వ్యక్తిత్వం ఉన్నవారు.
పేర్ని కిట్టు.. చాలా మంచోడట!
‘మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు పేర్ని కిట్టు నిలబడుతున్నాడు. వాళ్ల నాన్న (పేర్ని నాని) నాకు మంచి స్నేహితుడు. కిట్టు మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచాలి’ అని జగన్ కిట్టూకు కితాబు ఇచ్చారు. గత నాలుగేళ్లుగా యువనేతగా బందరును ఏలుతున్న వ్యక్తి. కిట్టు తండ్రి నానీ మంత్రి అయినా అనధికారికంగా మాత్రం ఎమ్మెల్యే తనయుడు కిట్టూనే.. కలెక్టర్ సైతం అధికారిక కార్యక్రమాల్లో కిట్టూతోనే కొబ్బరి కాయలు కొట్టించారు. ఎంపీని సైతం పక్కన పెట్టిన వ్యక్తిత్వం ఉన్నవారు. యువనేత అరాచకాలు బందరులో కథలు కథలుగా చెబుతుంటారు.
ఉప్పాల రాము.. ఆ మాత్రం దూకుడుంటే ఉత్సాహవంతుడేగా!
‘పెడన నుంచి రాము నిలబడుతున్నాడు. మంచివాడు. సౌమ్యుడు, ఉత్సాహవంతుడు.. ఇంజినీరు కూడా. మీ చల్లని దీవెనలు రాముపై ఉంచాలి !’ అని సీఎం చెప్పారు. రాము జడ్పీ ఛైర్పర్సన్ భర్త. పేరుకే ఆమె కుర్చీలో కూర్చున్నారు. పెత్తనం అంతా రామూదే. జడ్పీ వాహనాలన్నా..పెట్రోలన్నా.. రాముకు భలే ఇష్టం. బదిలీలు సైతం ఆయన కనుసన్నల్లోనే జరగాలి. దూకుడు, దురుసు స్వభావం ఉండే రాము జగన్ దృష్టిలో మంచి సౌమ్యుడే.
నటనకు ప్రతిరూపం.. కైలే అనిల్
‘పామర్రు నుంచి అనిల్ నిలబడుతున్నాడు. అనిల్కు ఎవరూ సాటి లేరు. మంచి వాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అనిల్పై ఉంచాలి..!’ అని జగన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఆయన సోదరుడు సమాంతర పాలన చేసినా మౌనంగానే ఉంటారు. తన పేరుతో ఇసుక, మట్టి దందా జరుగుతున్నా.. తెలియనట్లు నటించే ‘అమాయకుడు’ కైలే అనిల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్