జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది.
ఈనాడు, కాకినాడ: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం వద్ద ఏడీబీ రోడ్డులో ఆదిత్య విశ్వవిద్యాలయం ఉంది. ఈ విద్యాలయం మీదుగా జగన్ బస్సు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం సాగింది. దీంతో ముందస్తుగా సిద్ధమైన యాజమాన్యం.. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థులకు మేలు జరిగినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘థాంక్యూ సీఎం సార్’.. అంటూ భారీ ఫ్లెక్సీని ముద్రించి.. విద్యార్థులను యూనివర్సిటీ ఎదుట నిలబెట్టి ఆ ఫ్లెక్సీ పట్టుకుని నినాదాలు చేయించడానికి సిద్ధమైంది. విద్యార్థుల సమూహాన్ని చూసిన సీఎం బస్సు ఆపి కళాశాల వైస్ ఛైర్మన్ సతీష్రెడ్డితో మాట్లాడారు. విద్యా దీవెన అందరికీ అందుతుందా..? అని ఆరా తీశారు. ఇంతలో విద్యార్థులు ‘బాబులకే బాబు.. కల్యాణ్ బాబు’ అంటూ జనసేనాని పవన్ కల్యాణ్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ నినాదాల తీవ్రత పెరగడంతో అసహనానికి గురై సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి