తేడా వస్తే ఊరుకునేది లేదు.. పాల్వాయిగేటు వాసులకు ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరికలు
మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్నాడు ఉదయంనుంచే బెదిరింపులకు దిగారని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు.
పోలింగ్ రోజు అరాచకాలను గుర్తు చేసుకున్న గ్రామస్థులు
గురజాల, రెంటచింతల, న్యూస్టుడే: మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్నాడు ఉదయంనుంచే బెదిరింపులకు దిగారని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. తెల్లవారుజామున ఐదింటికే ఆయన గ్రామానికి వచ్చి తెదేపా ఏజెంట్ల వద్దకు వెళ్లి జాగ్రత్తగా ఉండండి.. తేడా వస్తే ఊరుకునేది లేదంటూ ఓ స్థాయిలో హెచ్చరించారని చెబుతున్నారు. అయినా వెరవకుండా తెదేపా ఏజెంట్లు ఉదయం ఆరింటికే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్నాటి తమ అనుభవాలను గ్రామస్థులు ‘ఈనాడు’కు తెలిపారు. ‘ఉదయం ఏడింటినుంచే ఎవరి ఓట్లు వారు వేసుకుంటున్నారు. తొమ్మిదింటి ప్రాంతంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరోసారి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినప్పుడు ప్రశాంతంగానే జరుగుతుందని వైకాపా కార్యకర్తలు చెప్పటంతో వెనుదిరిగారు. 11.30 గంటలకు మరోసారి వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన వాహనంతోపాటు మరో రెండు వాహనాలలో భారీగా కర్రలు, రాడ్లతో పోలింగ్బూత్ల వద్దకు చేరారు. రోడ్డుపై తన అనుచరగణం నిలిచి ఉండగా ఎమ్మెల్యే సరాసరి దూసుకెళ్లి ఈవీఎం పగులకొట్టారు. అంతే వేగంతో తిరిగి వెళ్లిపోయారు. అడ్డువచ్చిన వారిపై కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే అనుచరగణం దాడి చేసింది. దాడులలో పలువురు తెదేపా నేతలు గాయపడగా మహిళలనీ చూడకుండా దుర్భాషలాడారు. ఎమ్మెల్యేకు ఎదురుపడ్డ చెరుకూరి మణెమ్మ, వెలనాటి మస్తానమ్మనూ తీవ్రంగా దుర్భాషలాడారు.
భయాందోళనలో పోలింగ్ సిబ్బంది
ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలోకి విసురుగా ఈవీఎం కంపార్టుమెంట్ వద్దకు వెళ్తుండగా.. నిలువరించేందుకు పోలింగ్ సిబ్బంది ప్రయత్నించలేదు. పీవో, ఏపీవో ఇద్దరు నిల్చొని ఎమ్మెల్యేకు నమస్కరించారు. ఎమ్మెల్యే ఒక్కసారిగా ఈవీఎం పగులకొట్టడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ఈ సమయంలో తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేను, అనుచరులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి నమస్కారం పెట్టిన అధికారులు ఈవీఎం పగులకొట్టడం చూసినా కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎం పగులకొట్టారని వారి ఎన్నికల డైరీలో రాసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం పోలీసులకు పీవో, సెక్టోరల్ అధికారి, రూట్ అధికారి, ఆర్వో తదితర అధికారులూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈనెల 20న రెంటచింతల ఎస్సై ఈవీఎం పగులకొట్టిన కేసులో ఏ1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఛార్జిషీటులో చేరుస్తూ కోర్టుకు సమర్పించారు’ అని స్థానికులు తెలిపారు.
ఇనుపు రాడ్డుతో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడి హల్చల్
ముఖానికి ముసుగు కట్టి లుంగీ ధరించి, రాడ్డు పట్టిన ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి
కారంపూడి, న్యూస్టుడే: మొహం కనిపించకుండా టవల్ చుట్టి, మోకాళ్ల పైకి లుంగీ ఎగ్గట్టి, చేతిలో ఇనుప రాడ్డు పట్టి ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఓ వీధి రౌడీలా హల్చల్ చేసినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలింగ్ మరుసటిరోజు 14న వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయి. తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. తెదేపా శ్రేణులపై దాడులకు తెగబడ్డాయి. ఓ తెదేపా నాయకుడి కారుకు నిప్పుపెట్టాయి. ఈ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
వేలు చూపిస్తూ ఎమ్మెల్యే బెదిరించారు..
మహిళనని చూడకుండా చంపేస్తానంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి వేలు చూపుతూ బెదిరించారు. పథకాలు మీకు అందడం లేదా? అంటూ గర్జిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యేగా నాలుగుసార్లు పనిచేసినా మీరు ఇలా చేయటమేంటని అడిగితే దుర్భాషలాడుతూ అక్కడే నిల్చున్నారు. ఈ ఒక్క గ్రామంలోకే మీరు మూడుసార్లు రావడమేంటని, ఇక్కడినుంచి వెళ్లిపోవాలని సావధానంగానే చెప్పాం. అయినా వినిపించుకోకుండా మాపైకి వస్తూనే దుర్భాషలాడుతూ వెళ్లిపోయారు. మేము అక్కడ భారీగా గుమికూడిన మాచర్లకు చెందిన వైకాపా నాయకులను చూసి భయపడిపోయాం. పాల్వాయిని అంతం చేసేదాకా ఆగబోనంటూ ఆగ్రహంతో ఎమ్మెల్యే ఊగిపోవడంతో భయమేసింది.
చెరుకూరి మణెమ్మ, పాల్వాయిగేటు గ్రామం
కర్రలు, రాడ్లతో దిగారు
ఎమ్మెల్యే నడుచుకుంటూ మా ముందు నుంచి పోలింగ్బూత్లోకి వెళ్లారు. పోలింగ్ బూత్లో జరిగిన సంఘటనపై అక్కడ చర్చిస్తుండగా వేగంగా వచ్చిన ఎమ్మెల్యే మమ్మల్ని బూతులు తిట్టారు. ఇదేంటని మేము అడుగుతుండగానే మహిళలకు ప్రభుత్వం సాయం చేయలేదా? అంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేతోపాటు మాచర్లకు చెందిన వైకాపా నాయకులు, గ్రామానికి చెందిన పలువురు దుర్భాషలాడారు. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. రాళ్లు విసరడం, కర్రలతో దాడులు చేయడంతో భయాందోళనతో వణికిపోయాం.
వెలనాటి మస్తానమ్మ, పాల్వాయిగేటు గ్రామం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించారు.. నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో నారా లోకేశ్
మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. -
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు
‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. -
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..
‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్కానిస్టేబుల్కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. -
ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా
రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. స్టాన్ఫర్డ్లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
సంపన్న రాష్ట్రంగా చేద్దాం
‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. -
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. -
గృహ నిర్మాణాల పూర్తికి కృషి చేస్తాం: మంత్రి పార్థసారథి వెల్లడి
అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు. -
జగన్పై చర్యలు తప్పవు: గోరంట్ల
వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
పెద్దిరెడ్డి పాపాల నిగ్గు తేల్చాలి
అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్ ఆరోపించారు. -
పార్లమెంటులో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు
‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు. -
శాసనమండలి వద్దన్న వారికే.. నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది
శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి: వర్ల రామయ్య
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సవిత మంత్రి పదవి దక్కించుకోవడం హర్షణీయమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
రెండో రోజూ సచివాలయంలో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు. -
సీనియర్ల సేవల్ని వినియోగించుకుంటాం
మంత్రివర్గంలో చోటు కల్పించలేని సీనియర్ నాయకుల సేవల్ని వేరే రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సీనియర్ నాయకులు కొందరు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. -
ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ఛుగ్ విమర్శించారు. -
దేశవిదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం
పేద ప్రజలు, రైతాంగానికి చిత్తశుద్ధితో సేవలందించే అవకాశం పౌర సరఫరాల శాఖ ద్వారా తనకు దక్కిందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. -
ముమ్మరంగా పని చేయాలని అమిత్షా చెప్పారు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన వేదికపై కేంద్ర మంత్రి అమిత్షా.. తమిళనాడు భాజపా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైరల్ అయిన వీడియోలపై ఆమె స్పందించారు. -
రైతన్నకు అండగా ఉంటాం: వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రైతన్నకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వ హామీలు నీటి మూటలే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 190 రోజులు దాటినా ఆచరణలో విఫలమైందని ఆరోపించారు. -
నీట్ను.. ‘ఛీట్’గా మార్చేశారు
నీట్ పరీక్ష అంశంపై ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. నీట్ను కేంద్రం ‘ఛీట్’(మోసం)గా మార్చేసిందని ఆక్షేపించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారీ మెజార్టీతో గెలిపించారు.. నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో నారా లోకేశ్
-
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
-
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
-
రెస్కో.. అవినీతి చూస్కో
-
‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం!