చెట్ల కింద తలదాచుకుంటున్నాం..
పోలింగ్ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధిరౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆరోపించారు.
నా కుటుంబానికి ప్రాణహాని
పాల్వాయిగేటు తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు
పోలింగ్ రోజు వైకాపా గూండాలు దాడి చేయడంతో గాయాలయ్యాయని రక్తపు మరకలతో
ఉన్న తన ఫొటోను చూపుతున్న నంబూరి శేషగిరిరావు
ఈనాడు, అమరావతి, పట్టాభిపురం, న్యూస్టుడే: పోలింగ్ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధిరౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆరోపించారు. గుంటూరులో బుధవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి దూసుకొచ్చి స్వయంగా ఈవీఎం పగలగొట్టారని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే చర్యలతో ఎన్నికల సిబ్బంది, ఓటర్లు భయభ్రాంతులయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నంలో నాపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు’ అని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. ‘పాల్వాయి గేటు పోలింగ్బూత్లో నాతో పాటు మరో ఇద్దరు తెదేపా తరఫున ఏజెంట్లుగా ఉన్నాం. అప్పటికే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెండుసార్లు పోలింగ్బూత్లోకి వచ్చి వెళ్లారు. ఉదయం 11.30 సమయంలో వైకాపా ఏజెంట్లతోపాటు మేము అల్పాహారానికి బయటకు వచ్చాం. అప్పుడు మళ్లీ ఎమ్మెల్యే వచ్చారు. ఆయన నేరుగా ఈవీఎం వద్దకెళ్లి నేలకేసి రెండుసార్లు కొట్టారు. దాన్ని మేమూ ఊహించలేదు. పద్ధతి కాదని వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించా. ఎమ్మెల్యే వేలు చూపుతూ నీ అంతుచూస్తా.. బయటకు రా’ అంటూ బెదిరించారు. ఆయన బెదిరించినట్లే నాపై దాడి చేయించారు. మాచర్లలో ఎవరూ చికిత్స కూడా చేయలేదు. ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చేయించుకున్నా. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. పోలింగ్ రోజు నుంచి పాల్వాయిగేటులో ఎవరూ ఉండడం లేదు. వైకాపా నాయకులు దాడి చేస్తారన్న భయంతో చెట్ల కింద తలదాచుకుంటున్నాం. పొలాల వెంట తిరుగుతున్నాం. నాకు, నా కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నా. కేసుల భయంతో అందరూ పారిపోయారు. పల్నాడులో బాధితులనుంచి ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి లేనందున ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదులను తీసుకుని అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మూకల్ని అరెస్టు చేయాలి. గొడవలకు కారణమైన వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయాలి. మాచర్లలో ప్రశాంత వాతావరణం కల్పించాలి’ అని కోరారు.
నంబూరి శేషగిరిరావుతో మాట్లాడుతున్న జూలకంటి బ్రహ్మారెడ్డి
పిన్నెల్లిని రాజకీయ బహిష్కరణ చేయాలి
వీధిరౌడీలా ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చట్టసభల్లో అడుగుపెట్టకుండా రాజకీయ బహిష్కరణ చేయాలని మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా నేతల దాడికి గురైన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావును బ్రహ్మారెడ్డి బుధవారం గుంటూరులో పరామర్శించారు.
బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడి: గుంటూరు విద్యానగర్లోని బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసులు హడావుడి చేశారు. నంబూరి శేషగిరిరావును తీసుకుని ఎన్నికల కమిషన్, డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు బ్రహ్మారెడ్డి పయనమయ్యారు. గృహనిర్బంధంలో ఉన్న మీరు బయటకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. తాను మాచర్ల వెళ్లడం లేదని, ఎన్నికల కమిషన్, డీజీపీ వద్దకు వెళ్తున్నామని బ్రహ్మారెడ్డి పోలీసులకు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక పోలీసులు రెండు ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటుచేశారు. బ్రహ్మారెడ్డితో పాటు తెదేపా నాయకులు ఎస్కార్ట్ వాహనాలలో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణప్రసాద్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు వెంట ఉన్నారు.
శేషగిరిరావుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ
ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్స్టేషన్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ధైర్యంగా ఎదుర్కొన్న తెదేపా కార్యకర్త నంబూరి శేషగిరిరావుతో తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ఫోన్లో మాట్లాడారు. వైకాపా మూకల దాడిలో గాయపడ్డ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన శేషగిరిరావు సహా పలువురు తెదేపా కార్యకర్తలపై వైకాపావాళ్లు మారణాయుధాలతో దాడి చేశారు. అప్పటినుంచి శేషగిరిరావు అజ్ఞాతంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ