చెట్ల కింద తలదాచుకుంటున్నాం..
పోలింగ్ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధిరౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆరోపించారు.
నా కుటుంబానికి ప్రాణహాని
పాల్వాయిగేటు తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు
పోలింగ్ రోజు వైకాపా గూండాలు దాడి చేయడంతో గాయాలయ్యాయని రక్తపు మరకలతో
ఉన్న తన ఫొటోను చూపుతున్న నంబూరి శేషగిరిరావు
ఈనాడు, అమరావతి, పట్టాభిపురం, న్యూస్టుడే: పోలింగ్ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధిరౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆరోపించారు. గుంటూరులో బుధవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి దూసుకొచ్చి స్వయంగా ఈవీఎం పగలగొట్టారని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే చర్యలతో ఎన్నికల సిబ్బంది, ఓటర్లు భయభ్రాంతులయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నంలో నాపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు’ అని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. ‘పాల్వాయి గేటు పోలింగ్బూత్లో నాతో పాటు మరో ఇద్దరు తెదేపా తరఫున ఏజెంట్లుగా ఉన్నాం. అప్పటికే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెండుసార్లు పోలింగ్బూత్లోకి వచ్చి వెళ్లారు. ఉదయం 11.30 సమయంలో వైకాపా ఏజెంట్లతోపాటు మేము అల్పాహారానికి బయటకు వచ్చాం. అప్పుడు మళ్లీ ఎమ్మెల్యే వచ్చారు. ఆయన నేరుగా ఈవీఎం వద్దకెళ్లి నేలకేసి రెండుసార్లు కొట్టారు. దాన్ని మేమూ ఊహించలేదు. పద్ధతి కాదని వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించా. ఎమ్మెల్యే వేలు చూపుతూ నీ అంతుచూస్తా.. బయటకు రా’ అంటూ బెదిరించారు. ఆయన బెదిరించినట్లే నాపై దాడి చేయించారు. మాచర్లలో ఎవరూ చికిత్స కూడా చేయలేదు. ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చేయించుకున్నా. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. పోలింగ్ రోజు నుంచి పాల్వాయిగేటులో ఎవరూ ఉండడం లేదు. వైకాపా నాయకులు దాడి చేస్తారన్న భయంతో చెట్ల కింద తలదాచుకుంటున్నాం. పొలాల వెంట తిరుగుతున్నాం. నాకు, నా కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నా. కేసుల భయంతో అందరూ పారిపోయారు. పల్నాడులో బాధితులనుంచి ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి లేనందున ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదులను తీసుకుని అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మూకల్ని అరెస్టు చేయాలి. గొడవలకు కారణమైన వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయాలి. మాచర్లలో ప్రశాంత వాతావరణం కల్పించాలి’ అని కోరారు.
నంబూరి శేషగిరిరావుతో మాట్లాడుతున్న జూలకంటి బ్రహ్మారెడ్డి
పిన్నెల్లిని రాజకీయ బహిష్కరణ చేయాలి
వీధిరౌడీలా ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చట్టసభల్లో అడుగుపెట్టకుండా రాజకీయ బహిష్కరణ చేయాలని మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా నేతల దాడికి గురైన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావును బ్రహ్మారెడ్డి బుధవారం గుంటూరులో పరామర్శించారు.
బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడి: గుంటూరు విద్యానగర్లోని బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసులు హడావుడి చేశారు. నంబూరి శేషగిరిరావును తీసుకుని ఎన్నికల కమిషన్, డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు బ్రహ్మారెడ్డి పయనమయ్యారు. గృహనిర్బంధంలో ఉన్న మీరు బయటకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. తాను మాచర్ల వెళ్లడం లేదని, ఎన్నికల కమిషన్, డీజీపీ వద్దకు వెళ్తున్నామని బ్రహ్మారెడ్డి పోలీసులకు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక పోలీసులు రెండు ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటుచేశారు. బ్రహ్మారెడ్డితో పాటు తెదేపా నాయకులు ఎస్కార్ట్ వాహనాలలో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణప్రసాద్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు వెంట ఉన్నారు.
శేషగిరిరావుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ
ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్స్టేషన్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ధైర్యంగా ఎదుర్కొన్న తెదేపా కార్యకర్త నంబూరి శేషగిరిరావుతో తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ఫోన్లో మాట్లాడారు. వైకాపా మూకల దాడిలో గాయపడ్డ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన శేషగిరిరావు సహా పలువురు తెదేపా కార్యకర్తలపై వైకాపావాళ్లు మారణాయుధాలతో దాడి చేశారు. అప్పటినుంచి శేషగిరిరావు అజ్ఞాతంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..
‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్కానిస్టేబుల్కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. -
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం
‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. -
ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా
రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. స్టాన్ఫర్డ్లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
సంపన్న రాష్ట్రంగా చేద్దాం
‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. -
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. -
గృహ నిర్మాణాల పూర్తికి కృషి చేస్తాం: మంత్రి పార్థసారథి వెల్లడి
అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు. -
జగన్పై చర్యలు తప్పవు: గోరంట్ల
వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
పెద్దిరెడ్డి పాపాల నిగ్గు తేల్చాలి
అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్ ఆరోపించారు. -
పార్లమెంటులో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు
‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు. -
శాసనమండలి వద్దన్న వారికే.. నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది
శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి: వర్ల రామయ్య
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సవిత మంత్రి పదవి దక్కించుకోవడం హర్షణీయమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
రెండో రోజూ సచివాలయంలో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు. -
సీనియర్ల సేవల్ని వినియోగించుకుంటాం
మంత్రివర్గంలో చోటు కల్పించలేని సీనియర్ నాయకుల సేవల్ని వేరే రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సీనియర్ నాయకులు కొందరు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. -
ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ఛుగ్ విమర్శించారు. -
దేశవిదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం
పేద ప్రజలు, రైతాంగానికి చిత్తశుద్ధితో సేవలందించే అవకాశం పౌర సరఫరాల శాఖ ద్వారా తనకు దక్కిందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. -
ముమ్మరంగా పని చేయాలని అమిత్షా చెప్పారు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన వేదికపై కేంద్ర మంత్రి అమిత్షా.. తమిళనాడు భాజపా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైరల్ అయిన వీడియోలపై ఆమె స్పందించారు. -
రైతన్నకు అండగా ఉంటాం: వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రైతన్నకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వ హామీలు నీటి మూటలే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 190 రోజులు దాటినా ఆచరణలో విఫలమైందని ఆరోపించారు. -
నీట్ను.. ‘ఛీట్’గా మార్చేశారు
నీట్ పరీక్ష అంశంపై ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. నీట్ను కేంద్రం ‘ఛీట్’(మోసం)గా మార్చేసిందని ఆక్షేపించింది.