చంద్రబాబు, నీతీశ్‌లతో మాట్లాడలేదు: శరద్‌ పవార్‌

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌లతో తాను మాట్లాడానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Published : 05 Jun 2024 07:18 IST

ముంబయి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌లతో తాను మాట్లాడానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. తాను వారిని సంప్రదించలేదని తెలిపారు. ‘‘మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరిలతోనే మాట్లాడా. రేపు (బుధవారం) దిల్లీలో ఇండియా కూటమి నేతలంతా భేటీ కానున్నాం. ఆ భేటీలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’’అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని