భాజపా ఓటమే లక్ష్యం

దేశంలో మతోన్మాద పాలన సాగిస్తున్న భాజపాను నిలువరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించేది కమ్యూనిస్టులేనని, భాజపా

Published : 11 Aug 2022 06:11 IST

తమ్మినేని వీరభద్రం

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: దేశంలో మతోన్మాద పాలన సాగిస్తున్న భాజపాను నిలువరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించేది కమ్యూనిస్టులేనని, భాజపా ఓటమే లక్ష్యంగా ముందుకెళ్తామని అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నియోజకవర్గంలోని సీపీఎం మండల కార్యదర్శులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా విధ్వంస పాలన, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సీపీఎం మండల కార్యదర్శులకు సూచించారు. ఆగస్టు 15న గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి భాజపా మతతత్వ, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని