కాంగ్రెస్తోనే సమస్యలకు పరిష్కారం: రేవంత్
ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు
హస్తం పార్టీలో చేరిన జనగామ జిల్లా నేతలు
డిజిటల్ సభ్యత్వ నమోదుపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్రెడ్డి.
చిత్రంలో పార్టీ నేతలు సుదర్శన్రెడ్డి, శ్రీధర్బాబు, చిన్నారెడ్డి, హర్కవేణుగోపాల్
గాంధీభవన్, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు పలువురు గురువారం గాంధీభవన్లో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ..స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. 126 జీవో ద్వారా ఉద్యోగాల భర్తీ, బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తెచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనుక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించలేదని ఆక్షేపించారు.
* డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ ఇన్ఛార్జిలతో గాంధీభవన్లో రేవంత్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. గడువులోగా లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీలోగా పంజాగుట్ట సర్కిల్లో ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ను వి.హనుమంతరావు ఓ లేఖలో కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం