Congress: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ దంపతులు

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, భారాస ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ శోభన్‌రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Published : 25 Feb 2024 15:10 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, భారాస ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ శోభన్‌రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ...భారాసలో జరుగుతున్న అవమానాలు భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. భారాసలో ఉద్యమ నాయకులకు సరైన న్యాయం జరగడం లేదని మోతె శ్రీలత దంపతులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని