YS Jagan: జగన్.. 11.. 11.. దేవుడి స్క్రిప్ట్ ఇదీ?
సీఎం జగన్కు దేవుడి స్క్రిప్ట్ ఏంటో అర్థమైందో.. లేదో అని సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. వైకాపా 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు.
సీఎం జగన్కు దేవుడి స్క్రిప్ట్ ఏంటో అర్థమైందో.. లేదో అని సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. వైకాపా 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు. 1+6+4 మొత్తం 11 అవుతుంది. ఇదీ దేవుడి స్క్రిప్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు.
పులివెందులలో తగ్గిన జగన్ ఆధిక్యం
కూటమి సునామీ ప్రభావం పులివెందులలో జగన్ పైనా కనిపించింది. గత ఎన్నికల్లో 90,110 ఓట్ల మెజారిటీ సాధించిన జగన్.. ఈ సారి 61,687 ఓట్ల మెజారిటీకే పరిమితమయ్యారు. 28,423 ఓట్ల మెజారిటీ తగ్గింది. 2019లో ఇక్కడ తెదేపా అభ్యర్థికి 42,246 ఓట్లు రాగా, ఇప్పుడు 54,628 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి సైతం ఇప్పుడు 10,083 ఓట్లు వచ్చాయి.
‘‘చంద్రబాబుగారూ... ప్రజలకు మీపై ఉన్న నమ్మకానికి ఈ మహత్తర విజయం నిదర్శనం. రాజధాని లేని రాష్ట్రాన్ని తిరిగి నంబర్వన్గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా’’
‘‘పవన్ కల్యాణ్... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో నీకు తెలుసు. నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు ‘గేమ్ ఛేంజర్’వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది.’’
-చిరంజీవి
గుండు ఎప్పుడు బొత్స? నామకరణం ఎప్పుడు ముద్రగడ?
ఉగాది తర్వాత తెదేపా, జనసేన పార్టీలు ఉంటే గుండు కొట్టించుకుంటానన్నారు మంత్రి బొత్స. పవన్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు ముద్రగడ. తునిలో తనకు 15 వేల కంటే తక్కువ మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. ఈ భీషణ ప్రతిజ్ఞలను ఎప్పుడు నెరవేర్చుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మడకశిరలో వైకాపాను దెబ్బకొట్టిన నోటా
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో నోటా ఓట్లు అభ్యర్థులను దెబ్బకొట్టాయి. ఇక్కడ తెదేపా అభ్యర్థి ఎంఎస్ రాజుకు 79,983 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి ఈర లక్కప్పకు 79,632 ఓట్లు పోలయ్యాయి. 351 ఓట్లతో తెదేపా అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. ఇక్కడ నోటాకు 2,728 ఓట్లు పోలయ్యాయి. ఇది విజేత మెజారిటీతో పోలిస్తే 7 రెట్లు అధికం కావడం విశేషం.
ఉరవకొండ సెంటిమెంట్కు బ్రేక్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండేది. తాజా ఎన్నికల్లో తెదేపా నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించగా.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుంది.
తాడేపల్లిగూడెం తీర్పు విలక్షణం
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 1999 నుంచి 2024 వరకు ఇక్కడ జరిగిన ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999లో తెదేపా, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో భాజపా, 2019లో వైకాపా, 2024లో జనసేన అభ్యర్థులు గెలిచారు.
శ్రీభరత్కు 5,04,247 ఓట్ల భారీ ఆధిక్యం
విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన తెదేపా అభ్యర్థి శ్రీభరత్కు భారీ మెజారిటీ లభించింది. ఇక్కడ మొత్తం 13,66,795 ఓట్లు పోలవగా పోస్టల్ బ్యాలట్లతో కలిపి శ్రీభరత్కు 9,07,467 ఓట్లు, ప్రత్యర్థి ఝాన్సీకి 4,03,220 ఓట్లు లభించాయి. దీంతో శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీ సాధించారు.
భీమిలిలో గంటాకు భారీ ఆధిక్యం
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కూటమి తరఫున(తెదేపా) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై 92,401 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో తెదేపాకు 1,76,230 ఓట్లు రాగా వైకాపాకు 83,829 ఓట్లు వచ్చాయి.
పోలైన ఓట్లలో 68.77 శాతం నారాయణకే
నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ 70,513 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో 1,71,763 ఓట్లు పోలవ్వగా.. తెదేపాకు 1,18,126 వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 68.77 శాతం. వైకాపా అభ్యర్థి ఖలీల్కు 47,613 ఓట్లు వచ్చాయి.
గోరంట్ల బుచ్చయ్యదే బోణీ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి 1,29,060 ఓట్లు సాధించి.. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో తొలి విజయాన్ని బుచ్చయ్యచౌదరి నమోదు చేసుకున్నారు.
రామును అన్నారు.. చివరికి నాని పరార్!
‘లెక్కింపు రోజు ఉదయం 10:30కే కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఓటమి భయంతో పారిపోతారని’ మాజీమంత్రి కొడాలి నాని గతంలో అవాకులు పేలారు. కానీ లెక్కింపు కేంద్రం నుంచి నానియే మధ్యలో వెళ్లిపోయారు. దీనిపై నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
గాజువాకలో ‘పల్లా’కు రికార్డు స్థాయి మెజారిటీ
విశాఖ జిల్లా గాజువాక తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచి రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మొత్తం 3,33,611 ఓట్లకుగాను 2,32,949 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పల్లాకు 1,57,703 ఓట్లు రాగా, అమర్నాథ్కు 62,468 ఓట్లు వచ్చాయి.
వైకాపా అరాచక పాలనపై తీర్పు ఇది
రాష్ట్రంలో ఐదేళ్లు సాగిన వైకాపా అరాచక, అవినీతి, అస్తవ్యస్థ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని భాజపా జాతీయ కార్యదర్శి, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సత్యకుమార్ అన్నారు. సత్యకుమార్ మాట్లాడుతూ తన విజయం నియోజకవర్గ ప్రజలదేనన్నారు.
పవన్ నాపై పెట్టిన బాధ్యత నిలబెట్టుకున్నా: వర్మ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై పెట్టిన బాధ్యతను తప్పకుండా నిలబెట్టుకున్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పవన్ను అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వబోమన్న వైకాపా నేతలకు ఆయన గెలుపు చెంప పెట్టు అన్నారు. ‘వైకాపా వాళ్లు మద్యం పోయించారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా, పవన్ కల్యాణ్ను కూటమి తరఫున గెలిపించి శాసనసభకు పంపుతున్నాం’ అని చెప్పారు.
ఎన్డీయే కూటమికి 55.43 శాతం ఓట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన కూటమికి 55.43 శాతం ఓట్లు లభించగా, వైకాపా 39.37 శాతానికే పరిమితైంది. విడివిడిగా చూస్తే తెదేపాకు 45.60 శాతం, భాజపాకు 2.83 శాతం, జనసేనకు దాదాపు 7 శాతానికి పైగా ఓట్లు దక్కాయని అంచనా. ఎన్డీయే కూటమి పార్టీలు సాధించిన ఓట్లకు... వైకాపా సాధించిన ఓట్లకు మధ్య 16.06 శాతం మేర వ్యత్యాసం ఉంది. లోక్సభ స్థానాల్లో ఎన్డీయే కూటమికి సుమారు 54.4 శాతం, వైకాపాకు 39.61 శాతం ఓట్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి