TDP: ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ ఎన్నికల ప్రచారం: గోరంట్ల బుచ్చయ్య

సీఎం జగన్‌ను సాగనంపాలని అంతా కోరుకుంటున్నారని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Updated : 02 Mar 2024 13:21 IST

రాజమహేంద్రవరం: సీఎం జగన్‌ను సాగనంపాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని గద్దె దించి ఏపీని రక్షించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ‘‘దొంగ ఓట్లు చేర్చే కార్యక్రమాన్ని అంతా కలిసి అడ్డుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులను బయటకు పంపాలి. ఎక్కువ కాలం ఒకేచోట ఉన్న అధికారులను వెంటనే బదిలీ చేయడమే కాకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తోన్న వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలి. ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు’’ అని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని