Harish Rao: ‘ఇంత దిగజారడం అవసరమా’ అని కడియం శ్రీహరి ఆలోచించాలి: హరీశ్‌రావు

రేవంత్‌రెడ్డిపై గతంలో కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Updated : 01 Apr 2024 15:00 IST

హనుమకొండ: రేవంత్‌రెడ్డిపై గతంలో కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డితోనే కండువా కప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. హన్మకొండలో నిర్వహించిన భారాస లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇంత దిగజారడం అవసరమా అని కడియం శ్రీహరి ఆలోచించాలి. కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ భారాస అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువని కడియం శ్రీహరే అన్నారు. ఇప్పుడు అందులోకే వెళ్లారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.. అధైర్యపడాల్సిన అవసరం లేదు. వరంగల్‌ జిల్లా ఉద్యమాల ప్రాంతం.. ఇక్కడి కార్యకర్తలు భయపడరు. ఈ జిల్లాకు భారాస ప్రభుత్వం ఐదు మెడికల్‌ కళాశాలలు ఇచ్చింది. కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారు. దాన్ని ముట్టుకుంటే ఈ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది. ఉద్దెర మాటలు తప్ప కాంగ్రెస్‌ ఉద్ధరించేది లేదు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.. ఏం చేశారు?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు