Harish Rao: మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు విమర్శ

వరికి కాంగ్రెస్‌ ఇస్తామన్న బోనస్‌.. పెద్ద బోగస్‌ అని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Published : 20 May 2024 21:50 IST

హైదరాబాద్‌: వరికి కాంగ్రెస్‌ ఇస్తామన్న బోనస్‌.. పెద్ద బోగస్‌ అని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మరో హామీని తుంగలో తొక్కిందన్నారు. ‘వడ్లకు బోనస్‌ విషయంలో పెద్ద అబద్ధం ఆడారు. వరికి బోనస్‌ ఇస్తామని చెప్పి గెలిచాక మాట మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. వారందరి ఆశల్ని అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని, అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరం. రాష్ట్రంలో దాదాపు 90శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. 10శాతం సాగయ్యే సన్న వడ్లకు మార్కెట్లో మంచి ధర వస్తుంది. సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ సీజన్‌ నుంచే అన్ని రకాల వడ్లకూ రూ.500 బోనస్‌ చెల్లించాలి’’ అని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని