YS Jagan - YSRCP: ఇక చాలు జగన్... వైకాపా కకావికలం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Elections) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నేతృత్వంలోని వైకాపా ఘోర ఓటమి పాలైంది. 2019లో భారీ ఆధిక్యంతో గెలుపొందిన పార్టీ ఇప్పుడు ఎందుకు విఫలమైంది, జగన్ ఓటమికి కారణాలేంటి?
‘ఒక్క ఛాన్సు ఇవ్వండి..’ , ‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ అదేపనిగా చెప్పుకొని 2019లో గద్దెనెక్కిన జగన్.. అక్కడికెళ్లాక మాట తప్పాడు. ప్రజలను దూరం పెట్టాడు. ఏపీ అభివృద్ధిని పాతాళం వైపునకు తీసుకెళ్లాడు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్ర నేలను కరవు సీమగా మార్చాడు. నిరుద్యోగులు, ఉద్యోగులను కష్టాల కొలిమి పాల్జేశాడు. ఎటుచూసినా అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రెస్గా మారాడు. నెత్తిన పెట్టుకొన్న ఓటర్లు ఊర్కొంటారా! రాష్ట్రాన్ని పట్టించుకోక.. ప్రజల సమస్యలు తీర్చక.. ఆకాశమే హద్దుగా విధ్వంస పాలనకు తెగబడిన అక్రమార్కుడికి బుద్ధి చెబుతూ, 151 ఇచ్చిన వారే నేల మీదకు దించారు.
మూడు ముక్కలాట.. భూముల వేట
ఓ రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి! ఇది వినడానికే విడ్డూరం! కానీ ఇదే జరిగింది. ఏపీకి ఇది జగన్ చేసిన మోసం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘అమరావతికి సై’ అన్న జగన్.. పీఠమెక్కాక మూడు రాజధానులు అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’, ‘అభివృద్ధి’ అంటూ మాయమాటలు చెప్పారు. మాటల కోటలే కానీ అభివృద్ధి దిశగా అడుగు వేసింది లేదు. దాంతో ప్రజా రాజధాని అమరావతిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. పాలనా రాజధానిగా విశాఖని పిలిచి అక్కడ చేసిందేంటంటే.. భూముల పందేరం. కనిపించిన చోటల్లా కబ్జాలు చేయడం. ప్రశాంత విశాఖ చుట్టుపక్కల చాలా భూములు ఇప్పుడు వైకాపా నాయకుల చేతుల్లో ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. అమరావతినీ, ఉత్తరాంధ్రనీ తిరోగమనం దిశగా మళ్లించిన జగన్.. న్యాయ రాజధాని అంటూ కర్నూలు జనాలనూ మభ్యపెట్టారు. తానాడిన ఈ మూడు ముక్కలాటలో ప్రజలు తాత్కాలికంగా వెనకడుగు వేసి ఉండొచ్చు. కానీ ఓటేసే సమయం వచ్చీరాగానే.. ప్రభుత్వంపై వేటు వేసేశారు.
బటన్ నొక్కారు.. పన్నులతో బాదారు!
‘ఇలా బటన్ నొక్కడం, మీ ఖాతాలోకి డబ్బులు రావడం’ అంటూ గత ఐదేళ్లుగా జగన్ నెలకోసారి బటన్ నొక్కుతూనే ఉన్నారు. పథకం ఏదయినా అది కామన్. ‘సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల్ని మీ ఖాతాలో వేశాం’ అని గొప్పలు చెప్పుకొన్నారు. కానీ పావలా ఇచ్చి రెండ్రూపాయలు దోచేసే పద్ధతుల్ని అమల్లో పెట్టారు. దశల వారీగా మద్యనిషేధం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని నాసిరకం, హానికరమైన మద్యంతో రాష్ట్రాన్ని నింపేసి.. ఎందరో మరణాలకు కారణమయ్యారు. ప్రభుత్వ ఖజానా నింపుకొన్నారు. చెత్తపన్ను వేసిన గొప్ప ప్రభుత్వమూ ఇదే! పెట్రోలు, డీజిల్ రేట్లు ఏపీలోనే అత్యధికం. ఇక ‘వాహన మిత్ర’ని చూడండి. ఉదయం డబ్బులు పడతాయి. సాయంత్రానికల్లా పన్నుల బాదుడు. ‘మీరిచ్చే డబ్బులు మా ఆటోలు, కార్లు, వాహనాల రిపేర్లకే సరిపోవడం లేదు. మంచి రోడ్లు వేసి కాపాడండి మొర్రో’ అని ప్రజలు అదేపనిగా హారన్ కొట్టినట్టు వేడుకున్నారు. వింటేగా? పెడచెవిన పెట్టారు. అందుకే ‘గెలుపు శబ్దం’ వినబడకుండా చేశారు.
అభివృద్ధా.. అదెక్కడ?
‘ప్రతి నెలా డబ్బులు వేశాను.. ఇక జనాలు ఓట్లు వేయడం ఒక్కటే బాకీ..’ అనుకుంటూ ఇన్నేళ్లు కలలు కన్న జగన్కు ‘అభివృద్ధి’ అనే పదమే తెలియదు. ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభోత్సవం చేశారా? చంద్రబాబు ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిన పనులు, ప్రాజెక్టులకు మరోసారి పునాదులు వేశారు. ఒకవేళ అప్పటికే ఆ పని పూర్తయి పోయుంటే ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధి అంటే వైకాపా నాయకులకు మాత్రమే - అనేలా వ్యవహరించడంతో.. ఓట్లలో, సీట్లలో బాగా కోత పడింది.
జనాల మధ్యకు రారు.. దొరగారు
గత ఎన్నికలకు ముందు జగన్ ప్రజల మధ్యకి పాదయాత్ర అంటూ వచ్చారు. ‘నేను మీ అన్నని’, ‘మీ మామని’, ‘మీ బిడ్డని’ అంటూ ప్రజల్ని హత్తుకున్నారు. ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అలానే ప్రజల మధ్యకు వెళ్లి కష్టాలు వింటారేమో అనుకున్నారు. ‘సీఎం’ కాగానే కామన్ మ్యాన్ను మరిచిపోయారు. తాడేపల్లి ప్యాలెస్నే ప్రపంచమనీ, అందులోని వారే జనాలనీ అనుకున్నారు. ఆయన బయటికొచ్చినా ప్రజలకు భయమే. ‘దొరగారు బయటకు రాకపోవడమే బెటర్’ అనుకున్నారు. ఎందుకంటే సార్ బయటికొస్తే జనాలకు బస్సులు ఉండవు. పచ్చని చెట్లను నరికేస్తారు. హెలికాప్టర్లో వెళ్తున్నా.. కింద నేలపై గంటల కొద్దీ ట్రాఫిక్ ఆపేస్తారు. ఇదంతా చూసిన ప్రజలు ‘మా బాధ పట్టని వాడికి మేమెందుకు ఓటు వేయాలి’ అనుకున్నారు. లెక్క సరిచేశారు.
తల్లీ చెల్లీ కనపడరు.. ప్రజలెంత?
‘మీరే నా కుటుంబం.. మీ కోసమే నేను’ అంటూ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పిన సందర్భాలు బోలెడు. ఇదంతా నమ్మిన జనాలకు ఓటేశాక అసలు కథ తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ప్లేటు ఫిరాయించారు. ‘నిందితులకు కచ్చితంగా శిక్షపడాలి’ అని చెప్పిన నోరు ఒక్కసారిగా మూగబోయింది. తల్లి విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు. సోదరి షర్మిలను పొగబెట్టి బయటకు పంపేశారు. ఇక ‘అన్నా న్యాయం పక్కన నిలబడు’ అంటూ వచ్చిన వివేకా తనయ సునీతా రెడ్డి మీద ‘సొంతవాళ్ల’తో నానా మాటలు అనిపించాడు. ఆఖరికి ఇద్దరు చెల్లెళ్లు రోడ్డెక్కి ‘కొంగుచాపి’ మాకు న్యాయం చేయమని వేడుకున్నారు. ‘రాజధర్మమైనా పాటించు’ వివేకా భార్య కోరారు. ఇవేవీ జగన్ మనసుని కరిగించలేదు. ఇలాంటి పాషాణ హృదయుడు మాకు వద్దంటూ పదవి నుంచి దించేశారు.
తప్పులు తాను చేసి..
తాను తప్పు చేసి.. చుట్టూ ఉన్నవాళ్ల మీద నెట్టేసి, పక్కన పెట్టేసే వాళ్లను చూశారా? దీనికి నిలువెత్తు ఉదాహరణ వైఎస్ జగనే. ఆ గుణమే ఆయన్ను ఇప్పుడు సీఎం పదవి నుంచి కిందకు దింపేసింది. అసమర్థ, అవినీతి పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది అనే విషయం పసిగట్టిన జగన్.. తాను మారకుండా, తన పార్టీ అభ్యర్థులను మార్చారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు. పక్క జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్లను చేశారు. అందుకు ఓ ఉదాహరణ నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తీసుకొచ్చి నరసరావుపేటలో నిలబెట్టారు. ఇంతలా అభ్యర్థులను మార్చి ఏమార్చాలని చూసినా ‘ఇక చాలు’ జగన్ అని ఓటర్లు చెప్పేశారు.
దోచుకోడానికి ఓ చట్టం..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్… అందంగా, ముచ్చటగా కనిపిస్తున్న పేరు ఇది. ఈ చట్టాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేశారు జగన్. ప్రయోగాత్మకంగా ఈ చట్టం అమలు చేస్తున్నాం అని చెప్పినా.. దాని వెనుక పెద్ద భూ దోపిడీకి ప్రణాళిక రచించారు. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు అమలు చేయాల్సిన చట్టాన్ని.. తనకు నచ్చినట్లుగా మార్పులు చేసుకుని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. భూములను పార్టీ వాళ్లు, తనవాళ్లు గుంజేసుకునేలా తన మనుషులనే అధికారులుగా పెట్టుకునే చట్టాన్ని తయారు చేశారు. అయితే ఈ చట్టం వెనుక కుట్రను పసిగట్టిన కూటమి నేతలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంతటి ప్రమాదకారి మాకొద్దు అని పంపించేశారు.
ఉద్యోగాలు.. మా దగ్గర ఇవ్వరమ్మా
ఉద్యోగాల సంగతి చెప్పాలంటే.. ‘నిరుద్యోగుల ఆర్తనాదాలు వినని నీరో చక్రవర్తి’ అని జగన్కి పేరు. వచ్చీ రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు వేసేశాం అంటుంటారు. అవి ఎక్కడ, ఏవి, ఎలాంటివి అనే మాట చెప్పరు. ఉద్యోగ ప్రకటనలు, నోటిఫికేషన్లు అయినా ఇచ్చారా అంటే… అవీ లేవు. మెగా డీఎస్సీ అని ఎన్నికలకు ముందు ఓ దగా డీఎస్సీ వేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల సంగతి సరేసరి. ఇక ప్రైవేటు కంపెనీలు ఏమైనా వచ్చేలా చేశారా అంటే అదీలేదు. అప్పటికే స్థిరపడిన కంపెనీలను, వస్తాయని చెప్పిన వాటిని బెదిరించి భయపెట్టారు. దీంతో ‘మాకొద్దు ఏపీ’ అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర తీసుకొని ‘మాకొద్దు జగన్’ అని బైబై చెప్పేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు.. వామ్మో
ప్రతి నెలా ఒకటో తేదీన జీతం అందుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి పరిస్థితి ఏపీలో గత ఐదేళ్లలో లేదు. ‘జీతమో జగనా!’ అంటూ ఐదేళ్లు బాధపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి టాయిలెట్ల ఫొటోలు తీయడం, వైన్ షాప్ దగ్గర కూర్చొని లెక్కలు చూడటం లాంటివి ఈ ప్రభుత్వంలోనే చూశాం. ఆర్టీసిని తూతూ మంత్రంగా ప్రభుత్వ సంస్థల్లో కలిపేసి ఉద్యోగుల అవసరాలను గాలికొదిలేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ‘ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం చాలు’ అనుకున్నారు. రెండో ఛాన్సు లేకుండా.. రెండు పదుల సంఖ్య సీట్ల కంటే తక్కువకే పరిమితం చేశారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81